News May 19, 2024
పీడీఎస్ బియ్యందందా.. 9మందిపై కేసు

పెద్దవూర సమీపంలో పీడీఎస్ బియ్యందందా వ్యవహారంలో 9మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వీరబాబు తెలిపారు. వీరిలో నలుగురిని అరెస్టు చేసినట్లు, మిగతా వారు పరారీలో ఉన్నారని పోలీసులు వెల్లడించారు. ఈ నెల 16న మధ్యాహ్నం పోలీసులకు అందిన సమాచారం మేరకు తెప్పలమడుగు పరిధిలోని అమ్మ రైస్మిల్లో తనిఖీ చేశారు. ఒక లారీలో 550 బస్తాల పీడీఎస్ బియ్యం కలిగి ఉండటం గుర్తించి కేసు నమోదు చేశామన్నారు.
Similar News
News December 15, 2025
నల్గొండ జిల్లాలో ఈనాటి ముఖ్యాంశాలు

నల్లగొండ : మూడో విడత పోలింగ్ సిబ్బంది ర్యాండమేజేషన్
నల్గొండ: మహిళా కాంగ్రెస్ రాష్ట్ర జనరల్ కార్యదర్శిగా సాత్విక
చిట్యాల : డంపింగ్ యార్డుతో ఇబ్బందులు
నాంపల్లి : చెరువు నిండా వ్యర్థాలే
అనుముల : సాఫ్ట్వేర్ టు సర్పంచ్
దేవరకొండ : ముగిసిన మూడో విడత ప్రచారం
నకిరేకల్ : సర్పంచులకు సమస్యల స్వాగతం
నల్లగొండ : మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడో?
News December 15, 2025
మూడో విడతకు నల్గొండ యంత్రాంగం సిద్ధం

గ్రామ పంచాయతీ ఎన్నికల మూడో విడత పోలింగ్కు దేవరకొండ డివిజన్లో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈనెల 17న చందంపేట, దేవరకొండ సహా 9మండలాల్లోని 2,206 పోలింగ్ కేంద్రాలలో ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు అవసరమైన సిబ్బంది 2,647 ప్రిసైడింగ్, 2,959 అసిస్టెంట్ ప్రిసైడింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి చేశారు. ఎన్నికల పరిశీలకురాలు కొర్ర లక్ష్మీ, కలెక్టర్ ఇలా త్రిపాఠి సమక్షంలో సోమవారం ఈ ప్రక్రియ జరిగింది..
News December 15, 2025
చిట్యాల: రిగ్గింగ్ జరిగందంటూ ఎన్నికల కమిషనర్కు ఫిర్యాదు

చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామపంచాయతీ ఎన్నికల కౌంటింగ్లో అవకతవకలు, పోలింగ్లో రిగ్గింగ్ జరిగిందని సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన రుద్రారపు భిక్షపతి ఆరోపించారు. సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ కార్యాలయంలో సోమవారం ఫిర్యాదు చేశారు. తన గుర్తుపై ఓటేసిన బ్యాలెట్ పేపర్లు డ్రైనేజీలో పడేసి లెక్కింపులో అవకతవకలకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు.


