News December 12, 2025

పీలేరు హైవేపై ఘోర ప్రమాదం.. మహిళ దుర్మరణం

image

పీలేరు మండలం వేపుల బైలు పంచాయతీ వద్ద కొత్తగా వేసిన హైవేపై జరిగిన ప్రమాదంలో మహిళ మృతి చెందింది. మదనపల్లి నుంచి తిరుపతి వైపు వెళుతున్న కారు రోడ్డు దాటుతున్న వనజ (40)ను ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వనజను కారు డ్రైవర్ సెల్వం, బంధువులతో కలిసి పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పీలేరు ఎస్ఐ లోకేశ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News December 13, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News December 13, 2025

నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత అరెస్టు

image

నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత (2023) నర్గెస్‌ మొహమ్మదిని ఇరాన్ భద్రతా దళాలు అరెస్ట్‌ చేశాయి. ఇటీవల అనుమానాస్పద స్థితిలో మరణించిన ప్రముఖ న్యాయవాది ఖోస్రో అలికోర్డి స్మారక కార్యక్రమానికి హాజరైనప్పుడు ఆమెతో పాటు పలువురు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. కాగా మహిళా హక్కుల కోసం పోరాడుతున్న ఆమె గత పదేళ్లలో ఎక్కువ కాలం జైలులోనే గడిపారు. 2024లో తాత్కాలిక బెయిల్‌పై విడుదలయ్యారు.

News December 13, 2025

ములుగు: పొక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు

image

పోక్సో కేసులో నిందితుడికి ములుగు న్యాయస్థానం 20 ఏళ్లు జైలు శిక్షను విధించింది. ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ తెలిపిన వివరాలు.. బండారుపల్లికి చెందిన రవితేజ అనే ఆటో డ్రైవర్‌పై 2020లో మహేందర్ అనే ఆర్టీసీ కండక్టర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. నేడు కేసులో దోషిగా తేలినందుకు న్యాయమూర్తి సూర్య చంద్రకళ 20 ఏళ్లు కఠిన కారాగార శిక్ష, రూ.6వేలు జరిమానా విధిస్తూ తీర్పు ప్రకటించారు.