News December 23, 2025
పీవీ సేవలు చిరస్మరణీయం: హరీశ్ రావు

తెలంగాణ ముద్దుబిడ్డ, భారత రత్న, బహుభాషా కోవిదుడు పీవీ నరసింహారావు వర్థంతి సందర్భంగా ఆయనకు ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు నివాళులు అర్పించారు. భారతదేశ రాజకీయ, ఆర్థిక రంగాలను కొత్త దిశగా మలిచిన మహోన్నత నాయకుడిగా పీవీ చిరస్థాయిగా నిలిచారని పేర్కొన్నారు. ఆయన ప్రవేశపెట్టిన సంస్కరణలే నేటి అభివృద్ధికి పునాదిగా మారాయన్నారు. పీవీ సేవలను స్మరించుకుంటూ ఆయన చూపిన మార్గంలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
Similar News
News December 29, 2025
భిక్కనూర్: అన్నను చంపిన తమ్ముడి అరెస్టు

భిక్కనూర్ మండలం మోటాట్ పల్లిలో శనివారం ఎర్ర రాజు హత్యకు గురయ్యాడు. అతని తమ్ముడు శివ కుమార్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ సంపత్ కుమార్ తెలిపారు. సోదరుడు అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్ల తనకు పెళ్లి సంబంధాలు రావడం లేదని చంపినట్లు నిండుతుడు ఒప్పుకొన్నుట్లు సీఐ చెప్పారు. అతన్ని రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు.
News December 29, 2025
చివరి దశలో చర్చలు.. ఏం జరుగుతుందో: ట్రంప్

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై చర్చలు చివరి దశలో ఉన్నాయని, ఏం జరుగుతుందో చూడాలని US అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. కీలక చర్చల కోసం ఫ్లోరిడాకు వచ్చిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని ఆయన ఆహ్వానించారు. 2 దేశాలు శాంతిని కోరుకుంటున్నాయని చెప్పారు. పుతిన్, జెలెన్స్కీ ఒప్పందం చేసుకునేందుకు రెడీగా ఉన్నారని తెలిపారు. భేటీకి ముందు ట్రంప్, పుతిన్ ఫోన్లో మాట్లాడారు. మీటింగ్ తర్వాతా మాట్లాడనున్నారు.
News December 29, 2025
కామారెడ్డి: వృద్ధురాలి హత్య.. నిందితుడి అరెస్ట్

వృద్ధురాలి హత్య కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. ఎల్లారెడ్డి DSP శ్రీనివాస్ రావు తెలిపిన వివరాలు.. లింగంపేట(M) పోల్కంపేటకు చెందిన సులోచన(67) ఈ నెల 27న తన ఇంట్లో రక్తపు గాయాలతో శవమై కనిపించింది. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు. ముద్రబోయిన కుమార్ నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేశారు. ఆమె నుంచి దొంగిలించిన 4 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకునామన్నారు.


