News September 20, 2025

పీ-4 కార్యక్రమానికి సంధానకర్తలుగా పని చేయాలి: కలెక్టర్

image

జిల్లాలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు పీ-4 కార్యక్రమంలో బంగారు కుటుంబాలకు, మార్గదర్శకులకు సంధాన కర్తలుగా పనిచేయాలని కలెక్టర్ విజయకృష్ణన్ సూచించారు. అనకాపల్లి శంకరన్ సమావేశ మందిరంలో శనివారం పీ-4 కార్యక్రమంపై సచివాలయ సిబ్బందికి ఒకరోజు శిక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కీలక పాత్ర సచివాలయం ఉద్యోగులదేనని పేర్కొన్నారు. బంగారు కుటుంబాలకు కావలసిన అవసరాలను గుర్తించాలన్నారు.

Similar News

News September 20, 2025

NRPT: పథకాలను సద్వినియోగం చేసుకోండి

image

ప్రభుత్వం మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా మైనారిటీల అభ్యున్నతి కోసం రెండు కొత్త పథకాలను ప్రారంభించిందని వాటిని సద్వినియోగం చేసుకోవాలని నారాయణపేట జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి M.A.రషీద్ శనివారం కోరారు. ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన పథకంలో భాగంగా వితంతువు, విడాకులు, అనాథలకు వ్యాపారం చేసుకునేందుకు రూ.50 వేలు, ఫకీర్, దూదేకులకు లక్ష ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు.

News September 20, 2025

బాపట్ల జిల్లాకు భారీ వర్ష సూచన

image

దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ఉత్తర అంతర కర్ణాటక మీదుగా దక్షిణ మహారాష్ట్ర తీరం వరకు ద్రోణి విస్తరించి ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ MD ప్రఖర్ జైన్ శనివారం తెలిపారు. దీని ప్రభావంతో ఆదివారం బాపట్ల జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఉరుములతో కూడిన వర్షాలు పడేటప్పుడు చెట్లకింద నిలబడరాదని సూచించారు.

News September 20, 2025

HYD: అసలు మెట్రో మ్యాన్‌ను ఎందుకు తప్పించినట్టు?

image

మెట్రో పనులు ప్రారంభం నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు 18 సంవత్సరాలు.. హైదరాబాద్ మెట్రో అంటే ఆయన పేరే గుర్తుకు వస్తుంది. మెట్రో మ్యాన్ అనే పేరు కూడా సంపాదించుకున్నారు. ఆయనే ఎన్వీఎస్ రెడ్డి. మెట్రో ఎండీగా సుదీర్ఘ కాలం పాటు సేవలందించిన ఆయన్ను రేవంత్ రెడ్డి ఎందుకు తప్పించారు అనేది ఇపుడు సిటీలో చర్చనీయాంశంగా మారింది. అసలే సందిగ్ధంలో ఉన్న మెట్రో నిర్వహణపై ఎండీ మార్పు ప్రభావం పడుతుందనేది నిర్వివాదాంశం.