News April 12, 2024
పుట్టపర్తిలో అత్యధికంగా 41.1డిగ్రీలు
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పుట్టపర్తిలో అత్యధికంగా 41.1డిగ్రీల ఉష్టోగ్రతలు నమోదైనట్లు బుక్కరాయ సముద్రం వాతావరణ కేంద్రం శాస్త్రవేత్త సహదేవ రెడ్డి తెలిపారు. అదే విధంగా సీకే పల్లి 41, గుంతకల్ 40.9, తలుపుల 40.8, కదిరి 40.6, యల్లనూరు 40.5, ధర్మవరం, పరిగిలో 40.4, శెట్టూరు 40.3,యాడికి 40.2,కుడేరు, సింగణమలలో గరిష్ఠంగా 40.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు.
Similar News
News October 8, 2024
శ్రీ సత్యసాయి జిల్లాలో దారుణ హత్య
శ్రీ సత్యసాయి జిల్లాలో దారుణ హత్య జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. అమడగూరు మండలంలోని సుబ్బయ్య నారవపల్లి గ్రామ సమీపంలో రామలక్ష్మమ్మ (52) అనే వివాహితను ఓ తోటలో దుండగులు హత్య చేశారు. మృతురాలి స్వస్థలం పెనుకొండగా తెలుస్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News October 8, 2024
అనంత జిల్లాలో రోడ్డు ప్రమాదం.. UPDATE
అనంతపురం జిల్లా పామిడి పట్టణ శివారులోని శ్రీనివాస మిల్క్ డైరీ సమీపంలో గల 44 నంబర్ జాతీయ రహదారిపై సోమవారం బైక్ను ఐచర్ వాహనం ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో పామిడిలోని అంబేడ్కర్ కాలనీకి చెందిన లాలెప్ప తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందారు. మృతుడు గుత్తి ఏపీ మోడల్ స్కూలులో అటెండర్గా పని చేస్తున్నారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
News October 8, 2024
మంత్రి భరత్ను కలిసిన ఎంపీ అంబిక
రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ను అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మినారాయణ మర్యాదపూర్వకంగా కలిశారు. కర్నూలులోని మంత్రి నివాసంలో కలిసి జిల్లాలో సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. అనంతపురం నగరాన్ని పారిశ్రామిక వాడగా తీర్చిదిద్దాలని కోరారు. పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు.