News May 22, 2024
పుట్టపర్తి: 24 నుంచి టెన్త్ సప్లిమెంటరీ

పుట్టపర్తిలో ఈ నెల 24 నుంచి జూన్ 3 వరకు నిర్వహించే పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు జిల్లా విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఈఓ మీనాక్షి తెలిపారు. 29 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 7344మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఉదయం 9.30 గంటలకే పరీక్షలు ప్రారంభమవుతాయన్నారు. విద్యార్థులు 9గంటలకే విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని డీఈఓ మీనాక్షి సూచించారు.
Similar News
News September 12, 2025
5 నుంచి స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీ: జేసీ

జిల్లాలో కొత్త స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ ప్రకటించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. అనంతపురం జిల్లాలో 6,57,828 రేషన్ కార్డుదారులకు ఈనెల 15 నుంచి స్మార్ట్ రైస్ కార్డులు పంపిణీ చేస్తామని వెల్లడించారు. పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త కార్డులు అందిస్తామని చెప్పారు.
News September 11, 2025
అనంతపురం జిల్లా నూతన కలెక్టర్ ఈయనే!

అనంతపురం జిల్లా కొత్త కలెక్టర్గా ఓ.ఆనంద్ నియమితులయ్యారు. కేరళ రాష్ట్రం మలప్పురంలో జన్మించిన ఆయన కేరళ యూనివర్సిటీలో బీటెక్ పట్టభద్రుడయ్యారు. 2016 IAS బ్యాచ్కు చెందిన ఆనంద్ కేవలం 24 ఏళ్ల వయస్సులోనే IAS అయ్యారు. UPSC పరీక్షలో ఆల్ ఇండియా 33వ ర్యాంక్ సాధించారు. ప్రస్తుత కలెక్టర్ డా.వినోద్ కుమార్ బాపట్ల జిల్లా కలెక్టర్గా నియమితులయ్యారు.
News September 11, 2025
అనంత జిల్లాలో వర్షం.. పిడుగులు పడే అవకాశం..!

అనంతపురం జిల్లాలో ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని APSDMA పేర్కొంది. ‘ఇప్పటికే మీ ప్రాంతంలో పిడుగులు పడే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం వచ్చేటప్పుడు చెట్లు, టవర్స్, విద్యుత్ స్తంభాలు, పొలాలు, బహిరంగ ప్రదేశాలలో ఉండకూడదు. సురక్షితమైన ప్రాంతాలలో ఆశ్రయం పొందాలి’ అంటూ ఫోన్లకు సందేశాలు పంపింది. ఇలాంటి మెసేజ్ మీకు కూడా వచ్చిందా అయితే కామెంట్ చేయండి.