News June 15, 2024
పుట్టా గెలుపుతో తిరుమలకు పాదయాత్ర
మైదుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా
పుట్టా సుధాకర యాదవ్ గెలుపొందటంతో తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామికి మొక్కులు తీర్చుకొనేందుకు శనివారం జీవి సత్రం నుంచి టీడీపీ మండల అధ్యక్షుడు భీమయ్య ,యువ నేత కిశోర్ పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు రామచంద్రనాయుడు జెండా ఊపి ప్రారంభించారు. పాదయాత్రలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు .
Similar News
News October 2, 2024
కడప: కేంద్ర కారాగారాన్ని సందర్శించిన కలెక్టర్
కడప జిల్లా కేంద్ర కారాగారాన్ని జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ సందర్శించారు. గాంధీ జయంతి పురస్కరించుకొని గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేశారు. జైలు జీవితం గడుపుతున్న ప్రతి ఒక్కరూ క్షణిక ఆవేశంలో తప్పులు చేసి ఉంటారని అన్నారు. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను ప్రభుత్వం విడుదల చేస్తుందన్నారు. జైలు జీవితం గడిపేవారు విడుదల అయిన తర్వాత మంచి జీవితాన్ని గడపాలని సూచించారు.
News October 2, 2024
సిద్దవటం: పెన్నా నదిలో పడి బాలుడు మృతి
సిద్దవటంలోని పెన్నా నదిలో బుధవారం పుల్లంపేట గ్రామానికి చెందిన ఇస్మాయిల్ (6) అనే బాలుడు ప్రమాదశాత్తు నీట మునిగి మృతి చెందాడు. తన బంధువులతో కలసి విహారయాత్రకు వచ్చిన ఇస్మాయిల్ ప్రమాదశాత్తు నీట మునిగాడు. ఒంటిమిట్ట సీఐ కృష్ణంరాజు నాయక్ సంఘటనా స్థలానికి చేరుకొని ఈతగాళ్ల సాయంతో బాలుడిని బయటికి తీసుకొచ్చారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
News October 2, 2024
కడప పోలీస్ కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలు
గాంధీ జయంతి సందర్భంగా కడప నగరంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ చిత్రపటానికి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అహింసే ఆయుధంగా చేసుకుని బ్రిటిష్ వారిని ఎదిరించి, శాంతియుతంగా పోరాడి దేశానికి స్వతంత్ర్యం అందించిన మహానీయుడు గాంధీజీ అని కొనియాడారు.