News April 9, 2025
పురమిత్ర యాప్ ద్వారా సేవలు పొందండి: మౌర్య

రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రారంభించిన ‘పురమిత్ర’ యాప్ ద్వారా ప్రజలు మునిసిపల్ సేవలు పొందవచ్చని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య మంగళవారం తెలిపారు. ప్రజలు కార్యాలయాలు చుట్టూ తిరిగే పనిలేకుండా మున్సిపల్ సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పురమిత్ర యాప్ను రూపొందించిందన్నారు.
Similar News
News October 31, 2025
బీట్రూట్తో బ్యూటీ

బీట్రూట్ను డైట్లో భాగం చేసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో లాభాలున్నాయన్న విషయం తెలిసిందే. అయితే దీంతో అందాన్ని కూడా పెంచుకోవచ్చంటున్నారు నిపుణులు. * బీట్రూట్ రసం, పెరుగు కలిపి ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. దీంతో మచ్చలు తగ్గుతాయి. * బీట్రూట్ రసం, ఓట్స్ కలిపి స్క్రబ్ చేస్తే రక్తప్రసరణ పెరిగి చర్మం మెరుస్తుంది. బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల కూడా చర్మం ఆరోగ్యం బావుంటుందని చెబుతున్నారు.
News October 31, 2025
రేపటి నుంచి పోలీస్ యాక్ట్ అమలు: ఎస్పీ

సంగారెడ్డి జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా రేపటి నుంచి 30 రోజుల పాటు పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, ర్యాలీలు, సభలు, సమావేశాలు, ఆందోళన కార్యక్రమాలను నిర్వహించరాదని స్పష్టం చేశారు. అనుమతి లేకుండా కార్యక్రమాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. జిల్లాలో శాంతిభద్రతలకు ప్రజలు సహకరించాలని కోరారు.
News October 31, 2025
సబ్బుబిళ్లపై సర్దార్ పటేల్ చిత్రం

ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక అధ్యక్షుడు రామకోటి రామరాజు వినూత్నంగా నివాళులర్పించారు. సబ్బుబిళ్లపై సర్దార్ పటేల్ చిత్రాన్ని చెక్కి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్ర్య సమరయోధులు, భారతదేశ తొలి ఉప ప్రధాన మంత్రి అయిన పటేల్ అందరికీ ఆదర్శప్రాయులుగా నిలిచారని పేర్కొన్నారు.


