News April 13, 2025
పులిచెర్ల: బావిలో పడి 12 ఏళ్ల బాలుడి మృతి

పులిచెర్ల మండలంలో విషాదం నెలకొంది. అయ్యవారిపల్లెకు చెందిన సురేశ్-లత దంపతుల కుమారుడు దిలీప్ (12) శనివారం ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందాడు. వారు బెంగళూరు నుంచి ఉగాదికి స్వగ్రామానికి వచ్చారు. పొలం వద్ద చెల్లెలితో దిలీప్ ఆడుకుంటుండగా పొరపాటున బాల్ బావిలో పడింది. దాన్ని తీసుకునేందుకు వెళ్లిన దిలీప్ నీటిలో మునిగి మృతి చెందాడు. పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
Similar News
News April 15, 2025
చిత్తూరు TDP నేత ఇంట్లో విషాదం

TDP నేత ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. జీడీనెల్లూరు(M) జూపల్లిలో TDP నేత గోపాల్ రెడ్డి ఉండగా.. భార్య మీనా పిల్లలతో కలిసి బెంగళూరులో ఉంటున్నారు. తమిళనాడులోని గుడికి సోమవారం వెళ్లడానికి ప్లాన్ చేసుకున్నారు. బెంగళూరులో ఆదివారం మీనా పూలమాలలు తీసుకుని బయల్దేరారు. రాత్రి గోపాల్ రెడ్డి గుండెపోటుతో చనిపోయారు. ‘దేవుడికి వేయాల్సిన మాల నీపై వేయాల్సి వచ్చింది’ అంటూ మీనా విలపించడం అందరినీ కంటతడి పెట్టించింది.
News April 14, 2025
చిత్తూరు: కలిసి పనిచేసుకుందాం..!

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో TDP, YCP కార్యకర్తలు నువ్వానేనా అంటూ గొడవలు పడుతుంటే నేతలు మాత్రం కలిసి మెలిసి బిజినెస్లు చేసుకుంటున్నారు. జిల్లాలోని ఓ ఇద్దరు MLAల సహకారంతో ఓ మాజీ మంత్రి అప్పుడు(2024కు ముందు), ఇప్పుడు తన వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారంట. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన ఓ మంత్రికి మైనింగ్ బిజినెస్పై మంచి పట్టు ఉంది. ఆయనతో కలిసి చిత్తూరు జిల్లా మాజీ మంత్రి మైనింగ్ చేస్తున్నారని సమచారం.
News April 14, 2025
పుంగనూరు: టీచర్ మృతి.. అసలేం జరిగిందంటే?

పుంగనూరు మండలం సుగాలిమిట్టలో లారీ ఢీకొని నిన్న ఒకరు చనిపోయిన విషయం తెలిసిందే. కలకడ మండలం ఎర్రయ్యగారిపల్లెకు చెందిన శారద(40) కదిరిలో ప్రభుత్వ టీచర్గా పనిచేస్తూ అక్కడే నివాసం ఉంటున్నారు. విజయవాడలో ఆమె కుమార్తె కీర్తి ఇంటర్ చదువుతుండగా 973 మార్కులు వచ్చాయి. దీంతో విజయవాడ నుంచి కుమార్తెను తీసుకుని అరుణాచలం వెళ్లారు. తిరిగి స్వగ్రామానికి కారులో వస్తుండగా లారీ ఢీకొని చనిపోయారు.