News August 12, 2025
పులివెందులలో 60 శాతం దాటిన పోలింగ్

పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. మధ్యాహ్నం ఒంటిగంటకు పులివెందులలో 62.26 శాతం ఓటింగ్ నమోదైంది. మొత్తం 10,601 ఓట్లు ఉండగా.. ఇప్పటి వరకు 6,600 ఓట్లు పోలయ్యాయి. ఒంటిమిట్టలో 55.06 శాతం మంది ఓటు వేశారు. 24, 606 ఓట్లకు గాను ఇప్పటి వరకు 13, 549 ఓట్లు పోలయ్యాయి.
Similar News
News November 11, 2025
కడప విమానాశ్రయంలో భద్రతా ఏర్పాట్లపై సమీక్ష

సీఎం చంద్రబాబు చిన్నమండెం పర్యటన నేపథ్యంలో కడప విమానాశ్రయంలో భద్రతా ఏర్పాట్లపై జిల్లా SP షెల్కే నచికేత్ విశ్వనాథ్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఎయిర్పోర్ట్లో చేపట్టాల్సిన భద్రతా చర్యలపై అడ్వాన్స్ సెక్యూరిటీ లైజన్ (A.S.L) సమావేశం జరిగింది. ఈ సందర్భంగా SP పోలీసు శాఖతోపాటు ఇతర విభాగాల అధికారులకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని, అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని సూచించారు.
News November 10, 2025
కడప శ్రీ చైతన్యలో విద్యార్థిని ఆత్మహత్య

కడప శ్రీ చైతన్య బాలికల రెసిడెన్షియల్ స్కూల్లో తొమ్మిదో తరగతి బాలిక జస్వంతి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విద్యార్థిని పులివెందుల వాసిగా సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News November 10, 2025
ఎర్రగుంట్లలోని ఆలయంలో హీరో సుమన్ సందడి

ఎర్రగుంట్ల (M) కలమల్ల గ్రామంలోని చెన్నకేశవ స్వామి ఆలయంలో సినీ హీరో సుమన్ సందడి చేశారు. అక్కడ ఉన్న పురాతన తొలి తెలుగు శాసనాన్ని పరిశీలించారు. తెలుగు శాసనాన్ని కట్టుదిట్టంగా ఏర్పాటు చేయడానికి తనవంతు కృషి చేస్తానన్నారు. ఆయన వెంట ఆలయాధికారులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.


