News September 26, 2024
పులివెందుల: వివాహేతర సంబంధం.. రాళ్లతో కొట్టి చంపారు.

పులివెందులలో వేముల మండలం చాగలేరుకు చెందిన రామాంజనేయులుపై బుధవారం ఉదయం ఇద్దరు రాడ్లతో తలపై దాడి చేశారు. ఓ మహిళతో రామాంజనేయులు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ఆమె కొడుకులు సందీప్, శివ నాగేంద్ర రామాంజనేయుని తీవ్రంగా గాయపరిచినట్లు సీఐ గంగనాథ్ తెలిపారు. క్షతగాత్రుడిని తిరుపతికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు బంధువులు పేర్కొన్నారు. మృతుడి కొడుకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సీఐ చెప్పారు.
Similar News
News February 27, 2026
బ్రహ్మంగారిమఠంలో ఘోర రోడ్డు ప్రమాదం

కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం దొడ్ల డైరీ వద్ద శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్పైకి లారీ దూసుకురావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో బైక్పై ఉన్న ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. బైక్ లారీ కిందకి వెళ్లడంతో మంటలు చెలరేగాయి. స్థానికులు వెంటనే మంటలను అదుపు చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
News February 27, 2026
కడప: హిస్టరీ పేపర్-1 పరీక్షకు 89% మంది విద్యార్థులు హాజరు

కడప జిల్లాలో శుక్రవారం 43 సెంటర్లలో ఇంటర్ 1st ఇయర్ హిస్టరీ పేపర్-1 పరీక్షలు జరిగాయి. 2,144 మంది పరీక్షలు రాయాల్సి ఉండగా.. 1,912 మంది 89% హాజరయ్యారు. 232 మంది గైర్హాజరయ్యారు. జనరల్ విద్యార్థుల్లో 809 మందికి గాను.. 725 మంది పరీక్షలు రాశారు. 84 మంది ఆబ్సెంట్ అయ్యారు. ఒకేషనల్ విద్యార్థుల్లో 1,335 మందికి గాను.. 1,187 మంది హాజరవ్వగా, 148 మంది గైర్హాజరయ్యారు.2 చోట్ల మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదుచేశారు.
News February 27, 2026
ప్రొద్దుటూరులో బంతి బంతికి పందెం.?

T20 వరల్డ్ కప్ క్రికెట్ పోటీలు క్రికెట్ ప్రియులకు సందడిగా మారాయి. ఈ సీజన్లో ప్రొద్దుటూరులో ఎక్కడ చూసినా క్రికెట్ బెట్టింగ్ మాఫియాలు బంతి బంతికి పందెం నిర్వహిస్తున్నారు. యువత క్రికెట్ బెట్టింగ్ జూదానికి బానిస అయ్యారు. ప్రత్యేక బెట్టింగ్ యాప్లతో ఆన్లైన్లో బెట్టింగ్ నిర్వహిస్తున్నారనే సమాచారం వినిపిస్తోంది. ప్రొద్దుటూరు క్రికెట్ మాఫియాతో రాజకీయ నాయకులకు, పోలీసులకు లింక్ ఉందనే ఆరోపణలున్నాయి.


