News August 14, 2025

పులివెందుల ZPTC ఫలితాలు: ఎవరికి ఎన్ని ఓట్లు.!

image

పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక పూర్తి అయింది. టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతా రెడ్డి 6 వేల పై చిలుకు ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డిపై విజయం సాధించారు. 11 మంది బరిలో ఉన్నారు.
లతా రెడ్డి: 6716, హేమంత్ రెడ్డి: 683
శివ కళ్యాణ్ రెడ్డి: 101, సురేశ్ రెడ్డి: 4
అనిల్ రెడ్డి: 1, శివా రెడ్డి: 0
రవీంద్రా రెడ్డి: 14, గాజేంద్రనాథ్ రెడ్డి: 79
మారెడ్డి భరత్ రెడ్డి: 35, వెంగల్ రెడ్డి: 3
సునీల్ యాదవ్: 2.

Similar News

News August 16, 2025

MBNR: ట్రావెల్స్ బస్సు లారీ ఢీ UPDATE

image

జడ్చర్ల మండలం మాచారం వద్ద నిన్న తెల్లవారుజామున ఓ ట్రావెల్స్ బస్సు లారీని <<17409311>>ఢీకొన్న<<>> ఘటన తెలిసిందే. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్, కూకట్‌పల్లికి చెందిన అత్తాకోడళ్లు లక్ష్మీదేవి, రాధిక మృతి చెందగా, చికిత్స పొందుతూ క్లీనర్ మరణించాడు. అత్తాకోడళ్లు ఇద్దరూ మొదట పైబెర్తులో ఉండగా మార్గమధ్యంలో కిందికి వచ్చారు. పైనే ఉండి ఉంటే బతికేవారని బంధువులు విలపించారు. ఆసుపత్రిలో క్షతగాత్రులు కోలుకుంటున్నారు.

News August 16, 2025

ధవలేశ్వరం వద్ద గోదావరికి ఉద్ధృతి

image

ఎగువ కురుస్తున్న వర్షాలతో గోదావరిలో నీటిమట్టం క్రమంగా పెరుగుతుంది. ధవలేశ్వరంలోని కాటన్ బ్యారేజీ నుంచి 2.29 క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. వ్యవసాయ అవసరాల కోసం 3200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వరద ఇలాగే కొనసాగితే శనివారం సాయంత్రానికి వరద నీరు ఆల్లూరి జిల్లాలోని గండి పోచమ్మ ఆలయ గోపురాన్ని తాకే అవకాశం అధికారులు పేర్కొన్నారు.

News August 16, 2025

జనగామ జిల్లాలోని స్వాతంత్ర్య సమరయోధులు వీరే..!

image

స్వాతంత్ర్య సంగ్రామంలో జనగామ ప్రాంతం నుంచి పోరాటం చేసి తమ ప్రాణాలను సైతం అర్పించారు. వారు వివరాలు ఎస్.వీరయ్య(నిడిగొండ), సతరాసి నర్సయ్య(రఘునాథపల్లి), కంచనపల్లి నుంచి పాముకుంట్ల ఆయిలయ్య, కె.కృష్ణాజి, ముత్తిడి బుచ్చిరెడ్డి(జనగామ), కోరింగుల నారాయణరెడ్డి(గానుగపహాడ్), కె.జగన్నాథ్ రెడ్డి(గూడూరు), కళ్లెం నుంచి ఏలే వీరయ్య, ఏలే నారాయణలతో పాటు ఇతర గ్రామాల నుంచి రాగి నర్సింలు, జి.మోహన్ రెడ్డి ఉన్నారు.