News December 25, 2024

పుల్లంపేట: మూడు రోజుల వ్యవధిలో తల్లి, తండ్రి, కొడుకు మృతి

image

పుల్లంపేట మండలం రెడ్డిపల్లి చెరువు కట్ట వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రాజంపేట మండలం భువనగిరి పల్లికి చెందిన <<14954606>>భార్యాభర్తలు<<>> మృతి చెందిన విషయం విదితమే. ఆ ఘటనలో గాయపడిన వేలూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి కొడుకు బాల మణిచరణ్ బుధవారం ఉదయం మరణించాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ ప్రమాదంలో గాయపడ్డ వారి కుమార్తె ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Similar News

News September 13, 2025

కడప జిల్లా ఎస్పీ బదిలీ

image

కడప జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నూతన ఎస్పీగా నిచికేత్ ఐపీఎస్‌ను నియమిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్పీ అశోక్ కుమార్‌ను ఎక్కడికి బదిలీ చేశారనేది అధికారికంగా ఉత్తర్వులు రావాల్సి ఉంది.

News September 13, 2025

రూ.1.91 కోట్లు పలికిన ప్రొద్దుటూరు ఎగ్జిబిషన్ టెండర్

image

ప్రొద్దుటూరు ఎగ్జిబిషన్ నిర్వహణను బాక్స్ టెండర్‌లో రూ.1.91,44,000లకు శివకుమార్ దక్కించుకున్నాడు. శుక్రవారం ప్రొద్దుటూరులోని మున్సిపల్ కార్యాలయంలో ఎగ్జిబిషన్ టెండర్లను కమిషనర్ రవిచంద్రారెడ్డి ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు నిర్వహించారు. ఓపెన్, బాక్స్ టెండర్లను నిర్వహించారు. ఓపెన్ టెండర్‌లో సాకే పెద్దిరాజు రూ.1.76 కోట్లకు, బాక్స్ టెండర్‌లో శివకుమార్ రూ.1.91 కోట్లకు బిడ్ వేశారు.

News September 13, 2025

మైదుకూరు: తల్లీబిడ్డ మిస్సింగ్

image

మైదుకూరుకు చెందిన ముత్తరాయపల్లెలో నివసించే మేకల సుమతి (22) తన రెండేళ్ల కుమారుడు చందుతో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీనిపై భర్త చెండ్రాయుడు, ఆమె తల్లి మైదుకూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. సుమతి ఆచూకీ తెలిసినవారు మైదుకూరు సీఐ (9121100618), ఎస్సై(9121100619)కు సమాచారం ఇవ్వాలని కోరారు.