News March 2, 2026
పుష్పగిరిలో కనపడని యువకుల ఆచూకీ

వల్లూరు మండలంలోని పుష్పగిరి పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ఆదివారం సరదాగా ఈత కోసం దిగిన కొండాపురం మండలంలోని గండ్లూరుకు చెందిన శ్రీనాథ్ కడపకు చెందిన చైతన్య గల్లంతైన విషయం తెలిసిందే. వారికోసం పోలీసులు, బంధువులు గజ ఈతగాళ్ల సహాయంతో వెతుకులాట ఆరంభించారు. సోమవారం ఉదయం 9 వరకు వారి ఆచూకీ కనిపించలేదు. దాంతో వారి కుటుంబాలలో విషాద ఛాయలు అనుముకున్నాయి. వీరు కడప నగరంలో ఎంబీఏ చదువుతున్నారు.
Similar News
News March 2, 2026
ప్రొద్దుటూరులో భారీగా పెరిగిన బంగారు, వెండి ధరలు.!

బంగారం వ్యాపారంలో రెండో ముంబయిగా పేరుపొందిన ప్రొద్దుటూరులో సోమవారం బంగారు, వెండి ధరలు భారీగా పెరిగాయి.
ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో నేటి ధరలు ఇలా ఉన్నాయి.
*24 క్యారెట్ బంగారం 1గ్రాము ధర రూ.17,000
*22 క్యారెట్ బంగారం 1గ్రాము ధర రూ.15,640
*వెండి 10 గ్రాముల ధర రూ.2,992గా ఉంది.
News March 2, 2026
కడప జిల్లాలో రేపు బడులకు సెలవులు

హోలీ పండుగ సెలవు దినం రేపే అని కడప జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ శంషుద్దీన్ స్పష్టం చేశారు. అకడమిక్ క్యాలండర్లో తెలిపినట్లుగా హోలీ పండుగ సెలవు దినం నాలుగో తేదీ కాదని మార్చి మూడున నిర్ణయించామన్నారు. విషయాన్ని మండల విద్యాశాఖ అధికారులు గమనించాలని కోరారు.
News March 2, 2026
పుష్పగిరి నీళ్లలో యువకుని మృతదేహం లభ్యం

పుష్పగిరి పవిత్రమైన పుణ్యక్షేత్రంలో నీళ్లలో ఈత కోసం దిగి గల్లంతైన చైతన్య మృతదేహం లభ్యమైంది. రిస్క్ టీం సాయంతో మృతదేహాన్ని వెలికి తీశారు. మరో యువకుని జాడ కనిపించలేదు.


