News June 15, 2024
పుస్తకాలు తక్కువ వస్తే ప్రతిపాదనలు పంపాలి: డీఈఓ
విద్యార్థులకు పుస్తకాలు తక్కువ వస్తే ఎంఈఓలు ప్రతిపాదనలు పంపాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.అనురాధ సూచించారు. శుక్రవారం ప్రొద్దుటూరు అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్లోని స్టూడెంట్ కిట్ మండల స్థాయి స్టాక్ పాయింట్ను డీఈఓ, కడప డిప్యూటీ డీఈఓ రాజగోపాల్ రెడ్డి పరిశీలించారు. డీఈఓ మాట్లాడుతూ.. 8, 9 తరగతులకు కొరత ఉన్న పుస్తకాల మంగళవారం వస్తాయన్నారు. త్వరగా విద్యార్థులకు స్టూడెంట్ కిట్లను పంపిణీ చేయాలన్నారు.
Similar News
News October 2, 2024
కడప పోలీస్ కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలు
గాంధీ జయంతి సందర్భంగా కడప నగరంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ చిత్రపటానికి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అహింసే ఆయుధంగా చేసుకుని బ్రిటిష్ వారిని ఎదిరించి, శాంతియుతంగా పోరాడి దేశానికి స్వతంత్ర్యం అందించిన మహానీయుడు గాంధీజీ అని కొనియాడారు.
News October 2, 2024
కడప జిల్లాలో 581 మంది బైండోవర్
కడప జిల్లా వ్యాప్తంగా సెప్టెంబరులో అసాంఘిక కార్యకలాపాలపై ముమ్మరంగా దాడులు చేశామని ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 141 కేసుల్లో 581 మందిని బైండోవర్ చేశామన్నారు. మద్యం అక్రమ విక్రయాలపై దాడులు చేసి 204 లీటర్ల మద్యాన్ని స్వాధీనపరచుకుని, 37 మందిని అరెస్టు చేశామన్నారు. 67 మంది మట్కా నిర్వాహకులను అరెస్టు చేసి, రూ.5.96 లక్షలు, 382 మంది జూదరులను అరెస్టు చేశామని తెలిపారు.
News October 2, 2024
రక్తదానం చేసి ప్రాణాలను కాపాడాలి: కలెక్టర్
ప్రతి ఒక్కరూ మానవుడిగా పుట్టినందుకు రక్తదానం చేసి ప్రాణాలను కాపాడాలని కడప జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి అన్నారు. జాతీయ స్వచ్ఛంద దాతల దినోత్సవం సందర్భంగా.. ప్రభుత్వ రక్తనిధి కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం, మంగళవారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరానికి ముఖ్య అతిధిగా కలెక్టర్ పాల్గొన్నారు.