News May 19, 2024
పూతలపట్టు: స్ట్రాంగ్ రూముల వద్ద మూడంచెల భద్రత

పూతలపట్టు మండలం ఎస్.వి సెట్ ఇంజినీరింగ్ కళాశాలలో స్ట్రాంగ్ రూములలో కేంద్ర బలగాలతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి ఎస్.షన్మోహన్ పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జిల్లా జాయింట్ కలెక్టర్ పి.శ్రీనివాసులుతో కలిసి ఎస్.వి.సెట్ను ఆకస్మిక తనిఖీ చేశారు. స్ట్రాంగ్ రూముల వద్ద మూడంచెల భద్రత చేసినట్లు చెప్పారు.
Similar News
News December 30, 2025
చిత్తూరులో తగ్గిన నేరాల శాతం: SP

చిత్తూరు జిల్లాలో 2025 సంవత్సరంలో నేరాల శాతం తగ్గినట్టు ఎస్పీ తుషార్ తెలిపారు. పోలీసు శాఖ వార్షిక నివేదికను ఆయన తెలియజేశారు. గత సంవత్సరం 7034 కేసులు నమోదు కాగా, ఈసారి 5216 నమోదు అయ్యాయని, 26% తగ్గుదల కనిపించిందని చెప్పారు. రూ. 2 కోట్లు విలువచేసే 1021 మొబైల్ ఫోన్లను బాధితులకు అందించామన్నారు. సైబర్ బాధితులకు రూ. 68 లక్షలు రికవరీ చేసి అందజేశామన్నారు.
News December 30, 2025
చిత్తూరు జిల్లా పరిపాలన పునర్వ్యవస్థీకరణ

పలమనేరు రెవెన్యూ డివిజన్లో ఉన్న బంగారుపాలెం మండలాన్ని చిత్తూరు రెవెన్యూ డివిజన్లో విలీనం చేస్తూ ప్రభుత్వం తుది నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మార్పు 2025 డిసెంబర్ 31 నుంచి అమల్లోకి రానుంది. ఈ మేరకు గెజిట్లో ఉత్తర్వులు ప్రచురించనున్నారు. ఈ మార్పుతో బంగారుపాలెం మండల ప్రజలకు చిత్తూరు కేంద్రంగా పరిపాలనా సేవలు అందనున్నాయి.
News December 30, 2025
చిత్తూరు: క్రికెట్ టోర్నీలో అదరగొట్టిన యువకుడు

గుంటూరులో జరుగుతున్న ఎలైట్ అండర్-19 క్రికెట్ టోర్నీలో చిత్తూరు జిల్లా వి.కోట విద్యార్థి కార్తీక్ అదరగొట్టాడు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరపున ఆడుతున్న అతను సెమి ఫైనల్లో మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ క్రికెట్ అకాడమీ జట్టుపై చెలరేగి ఆడాడు. ఓపెనర్గా వచ్చిన కార్తీక్ 7 ఫోన్లు 3 సిక్సర్లతో 82 బంతుల్లోనే 96 రన్స్ చేశాడు. తన జట్టును ఫైనల్కు తీసుకెళ్లాడు. బుధవారం తుది పోరు జరగనుంది.


