News September 22, 2025
పూల అందాలతో ఆహ్వానిస్తున్న హైవే-161

నాలుగు వరుసల రహదారి మధ్యలో ఈ చెట్లకు పూసిన పసుపు పచ్చని పూలు. ఈ సీన్ చూస్తుంటే కనువిందు చేస్తుంది కదూ. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో నిజాంసాగర్ నుంచి మద్నూర్ వరకు 75 కిలోమీటర్ల మేర విస్తరించిన
హైవే-161 పై గతంలో నాటించిన పూల మొక్కలు ప్రస్తుతం వికసించాయి. ఈ రోడ్డు గుండా వెళ్లే వాహనదారులకు పచ్చని గడ్డి, పసుపు పచ్చని పూలు కనువిందు చేస్తూ కట్టి పడేస్తుంటాయి.
Similar News
News September 22, 2025
పెనుమూరు : మహిళా పోలీస్ సస్పెండ్

పెనుమూరు మండలంలోని సీఆర్. కండ్రిగ గ్రామ సచివాలయంలో విధులు నిర్వర్తిస్తున్న గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి శకుంతలకు కలెక్టర్ సుమిత్ కుమార్ సస్పెన్షన్ ఆర్డర్లు జారీ చేశారు. పెనుమూరు ఎంపీడీవో ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆమె రిజిస్టర్లో సంతకం చేయకపోవడంతో పాటు బయోమెట్రిక్ హాజరు కూడా నమోదు కాలేదని అన్నారు. కారణం ఏమిటని అడగ్గా సమాధానం సక్రమంగా లేని కారణంగా చర్యలు చేపట్టారు.
News September 22, 2025
నేటి నుంచి తగ్గనున్న విశాఖ డెయిరీ పాల ధరలు

ఇటీవల సవరించిన జీఎస్టి రేట్లతో పాలు, పాల ఉత్పత్తుల ధరలు తగ్గనున్నాయని విశాఖ డెయిరీ యాజమాన్యం ప్రకటించింది. ఈ కొత్త ధరలు నేటి నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించింది. విశాఖ డెయిరీలో మొత్తం 188 ఉత్పత్తుల్లో 94 ఉత్పత్తుల గరిష్ఠ అమ్మక ధరలు తగ్గనున్నాయి. పాలు లీటరుకు రూ.2 నుంచి రూ.3 వరకు తగ్గనుంది. పనీర్ కేజీ ప్యాకెట్ ధర రూ.20, నెయ్యి కేజీకి రూ.42, బట్టర్ రూ.40 వరకు తగ్గనున్నాయి.
News September 22, 2025
నేటి నుంచి తగ్గనున్న విశాఖ డెయిరీ పాల ధరలు

ఇటీవల సవరించిన జీఎస్టి రేట్లతో పాలు, పాల ఉత్పత్తుల ధరలు తగ్గనున్నాయని విశాఖ డెయిరీ యాజమాన్యం ప్రకటించింది. ఈ కొత్త ధరలు నేటి నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించింది. విశాఖ డెయిరీలో మొత్తం 188 ఉత్పత్తుల్లో 94 ఉత్పత్తుల గరిష్ఠ అమ్మక ధరలు తగ్గనున్నాయి. పాలు లీటరుకు రూ.2 నుంచి రూ.3 వరకు తగ్గనుంది. పనీర్ కేజీ ప్యాకెట్ ధర రూ.20, నెయ్యి కేజీకి రూ.42, బట్టర్ రూ.40 వరకు తగ్గనున్నాయి.