News December 26, 2025
పూసపాటిరేగ: లారీని ఢీకొట్టిన కారు.. వ్యక్తి మృతి

పూసపాటిరేగ మండలంలోని గుండపురెడ్డిపాలెం వద్ద హైవేపై బుధవారం రాత్రి జరిగిన ప్రమాదంలో విశాఖలోని అక్కయ్యపాలెం ప్రాంతానికి చెందిన దక్షిణామూర్తి(58) మరణించారు. చీపురుపల్లి నుంచి విశాఖ వెళ్తుండగా ముందున్న లారీని ఢీకొట్టి కారులో ఇరుక్కుపోయి తీవ్ర గాయాలపాలయ్యారు. ఆయనను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం దుర్మరణం చెందాడు. మృతుడి కొడుకు ఇచ్చిన పిర్యాదు మేరకు ఎస్సై దుర్గాప్రసాద్ కేసు నమోదు చేశారు.
Similar News
News December 27, 2025
మహాత్ముడి పేరుతో వచ్చిన పథకాన్ని కాపాడుకోవాలి: రేవంత్

TG: జనవరి 5 నుంచి మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం బచావో కార్యక్రమం చేపట్టాలని CWC సమావేశంలో నిర్ణయించినట్లు సీఎం రేవంత్ తెలిపారు. పలు ప్రయోజనాలతో తీసుకొచ్చిన పథకాన్ని రద్దు చేయడాన్ని తీవ్రంగా ఖండించినట్లు Xలో రాసుకొచ్చారు. మహాత్ముడి పేరుతో తీసుకువచ్చిన ఈ పథకాన్ని కాపాడుకోవాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. దీని కోసం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.
News December 27, 2025
రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారం అందుకున్న మదనపల్లె విద్యార్థిని

మదనపల్లె జవహర్ నవోదయ విద్యాలయం కామర్స్ విభాగంలో 12వ తరగతి చదువుచున్న విద్యార్థిని శివాని ప్రధానమంత్రి జాతీయ బాల పురస్కారానికి ఎంపికైంది. 26వ తేదిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా విద్యార్థిని అవార్డు అందుకుంది. జావెలిన్ త్రో, షాట్ పుట్లో ప్రతిభను గుర్తించి ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. శివాని 2023 గుజరాత్ లోను 2024లో బెంగుళూరులో జరిగిన పారా జాతీయ క్రీడల్లో జావలిన్ త్రో ప్రతిభను కనబరిచింది.
News December 27, 2025
KNR: ముదిరాజ్ సర్పంచ్ల సన్మాన పోస్టర్ ఆవిష్కరణ

ఈ నెల 30న హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించనున్న ముదిరాజ్ సర్పంచ్ల సన్మాన కార్యక్రమ పోస్టర్ను కరీంనగర్లో శనివారం ఆవిష్కరించారు. మన ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు సిద్ధి సంపత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంద నగేష్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికైన ముదిరాజ్ ప్రజాప్రతినిధులను గౌరవించుకోవడం ద్వారా రాజకీయ చైతన్యం పెంచడమే లక్ష్యమని వారు పేర్కొన్నారు.


