News January 29, 2025
పెంచికల్ పేట్ అటవీ రేంజ్లో బర్డ్ వాక్ ఫెస్టివల్

ఒకవైపు ప్రాణహిత మరోవైపు పెద్దవాగు అందాల నడుమ పాలరపు గుట్టపై నెలవైన పొడవు ముక్కు రాబందుల స్థావరం బర్డ్ వాక్ ఫెస్టివల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఎల్లూరు బొక్కివాగు ప్రాజెక్టు, కొండెంగల లొద్ది, బోల్ మెత్తం, రాగి చెట్టు మడుగు ప్రాంతాల్లో రకరకాల పక్షుల అందాలను తిలకించేందుకు ఆస్కారం ఉంది. ఇది వరకు నిర్వహించిన 3 విడతల్లో దాదాపు నాలుగు వందల రకాల పక్షులను గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
Similar News
News February 28, 2026
విజయవాడలో మృతదేహం కలకలం

విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న కృష్ణా నదిలో శనివారం గుర్తు తెలియని మగ వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో కృష్ణలంక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుని వయస్సు సుమారు 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుందని, ఒంటిపై కేవలం బనియన్ మాత్రమే ఉందని పోలీసులు తెలిపారు. మృతుని వివరాలు తెలిసిన వారు వెంటనే కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని కోరారు.
News February 28, 2026
ప్రతిభ ఆధారంగా విద్యార్థుల ఎంపిక.. మే 13-14న కౌన్సిలింగ్: కలెక్టర్

2026-27 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ క్రీడా పాఠశాలల్లో 4వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ASF కలెక్టర్ కె.హరిత తెలిపారు. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాఠశాలలకు మార్చి 4 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. మార్చి 13-17 మండల, మార్చి 28-ఏప్రిల్ 1 జిల్లా, ఏప్రిల్ 27-మే 1 రాష్ట్ర స్థాయి ఎంపికలు జరుగుతాయి. ఎంపికైన వారికి మే 13,14న కౌన్సిలింగ్ ఉంటుందన్నారు.
News February 28, 2026
ఖమ్మం: అదనపు కలెక్టర్కు తీన్మార్ మల్లన్న వినతి

భూదాన్ భూముల బాధిత కుటుంబాలకు అదే భూమిలో పునరావాసం కల్పించాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డిని కోరారు. శనివారం తీన్మార్ మల్లన్న అదనపు కలెక్టర్ను కలిసి సమస్యలతో కూడిన వినతిపత్రం అందించారు. తక్షణ సహాయం కింద ప్రతి బాధిత కుటుంబానికి రూ.1 లక్ష ఆర్థిక సాయం అందించాలని కోరారు. భూదాన్ భూముల విషయంలో పేదలపై మాత్రమే చర్యలు తీసుకోవడం అన్యాయమని లేఖలో ప్రస్తావించారు.


