News October 16, 2025
పెండింగ్ దరఖాస్తులు పరిష్కరించాలి: కలెక్టర్

రెవెన్యూకు సంబంధించిన పెండింగ్ దరఖాస్తులను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని KMR కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. భూభారతి దరఖాస్తులు, ప్రజావాణి విజ్ఞప్తులు తదితర 16 అంశాలపై కలెక్టర్ రివ్యూ చేశారు. రెవెన్యూ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించరాదని సూచించారు. అదనపు కలెక్టర్ విక్టర్, సబ్ కలెక్టర్ కిరణ్మయి ఉన్నారు.
Similar News
News October 17, 2025
మహిళలకు ఎడమ కన్ను అదిరితే?

స్త్రీలకు తరచుగా ఎడమ కన్ను అదిరితే శుభప్రదమని పండితులు చెబుతున్నారు. ఇది త్వరలో కొత్త వస్త్రాలు, ఆనందకరమైన స్నేహాలు, భాగస్వామితో మంచి అనుబంధం వంటి శుభప్రదమైన ప్రయాణ యోగాన్ని సూచించే దైవిక సంకేతమని అంటున్నారు. కెరీర్లో విజయం సాధించే అవకాశాలుంటాయని చెబుతున్నారు. అయితే వివాహితకి కుడి కన్ను అదరడం చెడు శకునం అని పేర్కొంటున్నారు. దీనివల్ల భవిష్యత్తులో సమస్యలు, ఆటంకాలు ఎదురుకావచ్చని అంటున్నారు.
News October 17, 2025
రన్స్ చేస్తే ఓకే.. చేయలేదో!

INDvsAUS మధ్య 3 మ్యాచుల వన్డే సిరీస్ ఈ నెల 19 నుంచి ప్రారంభం కానుంది. దీంతో అందరి దృష్టి స్టార్ ప్లేయర్లు విరాట్, రోహిత్లపైనే ఉంది. వచ్చే వన్డే వరల్డ్కప్ జట్టులో స్థానం దక్కాలంటే వీరు ఈ సిరీస్లో రాణించడం కీలకం. అదే విఫలమయ్యారో ఇబ్బందులు తప్పవు. ఇప్పటికే వారి ప్రాతినిధ్యంపై సెలక్షన్ కమిటీ, కోచ్ క్లారిటీ ఇవ్వలేదు. కాగా AUSలో వీరిద్దరికీ మంచి రికార్డ్ ఉంది. రోహిత్, కోహ్లీ చెరో 5 సెంచరీలు బాదారు.
News October 17, 2025
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం భగభగలు

అంతర్జాతీయ మార్కెట్(COMEX)లో బంగారం ధరలు రికార్డులు తిరగరాస్తున్నాయి. నిన్న ఔన్సు $4250 ఉండగా, ఇవాళ అది $4300 దాటేసింది. అంతేకాకుండా మార్కెట్ క్యాప్ విలువ $30 ట్రిలియన్స్ క్రాస్ అయింది. ఒక అసెట్ ఈ మార్క్ను దాటడం చరిత్రలో ఇదే మొదటిసారి. US-చైనా ట్రేడ్ వార్, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వంటి గ్లోబల్ టెన్షన్స్ వల్లే పెట్టుబడిదారులు బంగారాన్ని సేఫ్ అసెట్గా భావిస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.