News October 11, 2025
పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్

రెవెన్యూకు సంబంధించిన పెండింగ్లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్ కలిసి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూభారతి, సాదా బైనామాకు సంబంధించిన దరఖాస్తులను జాగ్రత్తగా క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సూచించారు. కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, ఆర్డీవోలు తదితరులు పాల్గొన్నారు.
Similar News
News October 11, 2025
ప్రొద్దుటూరులో మట్కా బీటర్లు అరెస్ట్

ప్రొద్దుటూరు 2-టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మట్కా జూదం ఆడుతున్నవారిని శుక్రవారం అరెస్ట్ చేసి వారినుంచి రూ.10,170లు స్వాదీనం చేసుకున్నట్లు సీఐ సదాశివయ్య తెలిపారు. తమకు రాబడిన సమాచారం మేరకు మట్కా ఆడుతున్న శ్రీనివాస నగర్కు చెందిన షేక్ గఫార్, కరీముల్లా, నాయబ్, రఘు, సన్న ముత్యాలు, నీలాధర్, సయ్యద్ ఖాజా, సుబ్బయ్యలను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అసాంఘిక కార్యక్రమాల సమాచారం ఇవ్వాలని ప్రజలను సీఐ కోరారు.
News October 11, 2025
నేతన్న భరోసా పథకానికి రూ.48.80 కోట్లు: మంత్రి తుమ్మల

TG: నేతన్న భరోసా పథకానికి ఈ ఏడాది రూ.48.80 కోట్లు కేటాయించనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. నేతలకు రూ.18వేలు, అనుబంధ కార్మికులకు రూ.6వేల చొప్పున రెండు విడతల్లో అందజేస్తామన్నారు. చేనేత కార్మికుల రుణమాఫీ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. 6,780 మందికి రూ.లక్ష వరకు మాఫీ కానున్నట్లు పేర్కొన్నారు. 65 లక్షల ఇందిరమ్మ చీరలను నవంబర్ 15 నాటికి సిద్ధం చేయాలని సూచించారు.
News October 11, 2025
నగరంలో అమలు కానీ ‘సింగల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్’

HYD మోజంజాహి మార్కెట్, కాటేదాన్, నాచారం, బేగంబజార్, అమీర్పేట్, మల్లాపూర్, బాలానగర్, ప్రాంతాల్లో సింగల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం ఏమాత్రం తగ్గటం లేదు. కిరాణా దుకాణాలు, రైతు బజార్లలో ఎక్కడపడితే అక్కడ ఈ కవర్లు దర్శనమిస్తున్నాయి. నగరంలో సుమారు 8,500 టన్నుల గార్బేజీ వ్యర్థాలు ఉత్పత్తి అవుతుండగా, వీటిలో సుమారు 12 టన్నులకు పైగా ఇవే కనిపిస్తున్నాయి.