News October 3, 2024

పెండ్లిమర్రి: పిడుగు పడి ముగ్గురు మృతి

image

పెండ్లిమర్రి మండలంలో గురువారం పిడుగుపాటుకు ముగ్గురు మృతి చెందారు. మండలంలోని తుమ్మలూరు పరిసర ప్రాంతాల్లో పశువులను మేపేందుకు వెళ్లి సాయంత్రం 5 గంటల ప్రాంతంలో పిడుగుపాటు గురై ఓ మహిళ, ఓ అబ్బాయి మరణించారు. అలాగే పగడాలపల్లికి చెందిన మరో యువకుడు ఇసుక తోలుకోవడానికి వెళ్లి మరణించారు. సమాచారం తెలియగానే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Similar News

News February 27, 2026

బి.మఠం: మృతులు బద్వేలు వాసులుగా గుర్తింపు

image

బ్రహ్మంగారిమఠం మండలం నంది పల్లె పాల డైరీ వద్ద లారీ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే ఇద్దరు <<19255263>>మృతి<<>> చెందిన విషయం తెలిసిందే. మృతులు భార్యభర్తలు కావ్య, ప్రసాద్‌గా స్థానికులు గుర్తించారు.బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని మార్తమ్మ నగర్‌లో నివాసం ఉంటున్నట్లుగా సమాచారం. వీరి తల్లిదండ్రులు బద్వేల్ మున్సిపాలిటీ కుమ్మరి కొట్టాలలో ఉన్నారని తెలుస్తోంది.

News February 27, 2026

బ్రహ్మంగారిమఠంలో ఘోర రోడ్డు ప్రమాదం

image

కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం దొడ్ల డైరీ వద్ద శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్‌పైకి లారీ దూసుకురావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. బైక్ లారీ కిందకి వెళ్లడంతో మంటలు చెలరేగాయి. స్థానికులు వెంటనే మంటలను అదుపు చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News February 27, 2026

కడప: హిస్టరీ పేపర్-1 పరీక్షకు 89% మంది విద్యార్థులు హాజరు

image

కడప జిల్లాలో శుక్రవారం 43 సెంటర్లలో ఇంటర్ 1st ఇయర్ హిస్టరీ పేపర్-1 పరీక్షలు జరిగాయి. 2,144 మంది పరీక్షలు రాయాల్సి ఉండగా.. 1,912 మంది 89% హాజరయ్యారు. 232 మంది గైర్హాజరయ్యారు. జనరల్ విద్యార్థుల్లో 809 మందికి గాను.. 725 మంది పరీక్షలు రాశారు. 84 మంది ఆబ్సెంట్ అయ్యారు. ఒకేషనల్ విద్యార్థుల్లో 1,335 మందికి గాను.. 1,187 మంది హాజరవ్వగా, 148 మంది గైర్హాజరయ్యారు.2 చోట్ల మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదుచేశారు.