News July 6, 2024

పెంపుడు జంతువులతో అతి మురిపెం .. ప్రమాదకరం!

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రోజువారీగా రేబిస్ వ్యాధి నిరోధక టీకాలు తీసుకుంటున్న వారి సంఖ్య సగటున 30గా నమోదవుతోంది. రేబిస్ కారణంగా ఏటా 500-600 గేదెలు, ఆవులు తదితర పశువులు మృత్యువాత పడుతున్నాయి. కుక్కలు, పిల్లులు కరిస్తే పది నిమిషాల్లోపు ఆప్రాంతంలో నురగ వచ్చే వరకు సబ్బుతో ఎక్కువసార్లు శుభ్రపరచాలి. అప్రమత్తంగా లేకపోతే వీటి నుంచి సంక్రమించే వ్యాధులతో మనుషుల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది.

Similar News

News October 7, 2024

కొత్తగూడెం: ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

కొత్తగూడెం రుద్రంపూర్ ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ రమేష్ తెలిపారు. పదో తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈనెల 9లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆరు కొత్త కోర్సులలో సీట్లు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. ఆగస్టు 1 నాటికి 14 సంవత్సరాలు నిండిన విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు.

News October 7, 2024

ఖమ్మం: నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపితే కేసులు: ట్రాఫిక్ ఏసీపీ

image

ఖమ్మంలో ఉద్దేశపూర్వకంగా నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామని ట్రాఫిక్ ACP శ్రీనివాసులు తెలిపారు. పోలీస్ కమిషనర్ ఆదేశాలతో వాహన తనిఖీల్లో భాగంగా నంబర్ ప్లేట్ లేని 55 బైకులను ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు చెప్పారు. ప్రస్తుతం పట్టుబడిన వాహన పత్రాలు, ఛాసిస్ నంబర్లు తనిఖీ చేస్తూ చోరికి గురైన వాహనాలు ఏమైనా ఉన్నాయో లేదో పరిశీలిస్తునట్లు పేర్కొన్నారు.

News October 7, 2024

రేపు ఖమ్మం నగరంలో డిప్యూటీ సీఎం పర్యటన

image

ఖమ్మం నగరంలో మంగళవారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటించనున్నట్లు స్థానిక కాంగ్రెస్ నేతలు ఓ ప్రకటనలో తెలిపారు. ముందుగా డిప్యూటీ సీఎం జిల్లా కలెక్టరేట్‌లో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్ జిల్లాల ఎంపీడీసీఎల్ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారని చెప్పారు. తదనంతరం డిప్యూటీ సీఎం బతుకమ్మ వేడుకల్లో పాల్గొంటారని పేర్కొన్నారు.