News October 6, 2025
పెగడపల్లి: స్థానిక ఎన్నికలపై ఆశావహుల్లో ఉత్కంఠ

స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం ముమ్మరంగా ఏర్పాటు చేస్తుండగా, మరోవైపు కోర్టులో ఎలాంటి తీర్పు వస్తుందోనని ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిన నేపథ్యంలో దాన్ని సవాల్ చేస్తూ హైకోర్టు, సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యాయి. దీనిపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనుండగా, ఈ నెల 8న హైకోర్టులో విచారణ జరగనుంది. దీనిపై జడ్జిమెంట్ ఎలా వస్తుందో మరి.
Similar News
News April 5, 2026
బంగ్లాదేశ్ సరిహద్దులో పాములు, మొసళ్లతో రక్షణ!

భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు రక్షణ కోసం మొసళ్లు, విషపూరితమైన పాములను ఉంచాలని BSF యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఫెన్సింగ్ వేయడం సాధ్యం కాని 175 కి.మీ మేర వీటితో రక్షణ కల్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే BSFకు సిబ్బంది కొరత ఉండగా ఆ సమస్య కూడా తీరుతుందని భావిస్తున్నారు. కాగా బంగ్లాతో మనకు 4,096 KM సరిహద్దు ఉండగా ఇప్పటివరకు 3,240 KM మేర ఫెన్సింగ్ వేశారు.
News April 5, 2026
తిరుపతి జిల్లాలో మర్డర్!

చంద్రగిరి(M) రామిరెడ్డిపల్లెలోని ఓ ప్రైవేట్ కాలేజీ సమీపంలో డెడ్ బాడీ కలకలం రేపింది. మృతుడిని తిరుపతి రైల్వే కాలనీకి చెందిన టాక్సీ డ్రైవర్ శ్రీనివాసులుగా పోలీసులు గుర్తించారు. మార్చి 28న తనపల్లి వద్ద 8 మంది స్నేహితులతో కలిసి శ్రీనివాసులు మద్యం సేవించినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో తలెత్తిన గొడవలో స్నేహితులే హతమార్చి, మృతదేహాన్ని రామిరెడ్డిపల్లె సమీపంలో పడేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
News April 5, 2026
ASF రవాణా శాఖకు రూ.549 లక్షల ఆదాయం

ASF జిల్లాలో రవాణా శాఖ 2025 ఏప్రిల్ 1 నుంచి 2026 మార్చి 31 వరకు రూ.624 లక్షల లక్ష్యాన్ని నిర్దేశించగా, రూ.549.43 లక్షల ఆదాయం సాధించింది. దీంతో 87.84 శాతం లక్ష్యం నెరవేరినట్లు అధికారులు తెలిపారు. ఈ కాలంలో మొత్తం 99,967 వాహనాలు రిజిస్ట్రేషన్లు అయ్యాయి. వాహనాల సంఖ్య పెరగడంతో రిజిస్ట్రేషన్లు కూడా పెరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. లక్ష్యం పూర్తిగా చేరకపోయినా గత ఏడాదితో పోలిస్తే ఆదాయం పెరిగిందన్నారు.


