News May 3, 2024
పెదకూరపాడులో నేడు సీఎం జగన్ పర్యటన

పెదకూరపాడు నియోజకవర్గంలో శుక్రవారం సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. క్రోసూరులోని తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లే రహదారిలో ఏర్పాటు చేసిన మేమంతా సిద్ధం సభ వద్దకు జగన్ మధ్యాహ్నం 12గంటలకు చేరుకొని, ప్రసంగించనున్నారు. ట్రాఫిక్కు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎస్పీ బిందు మాధవ్ సిబ్బందికి పలు సూచనలు చేశారు.
Similar News
News February 22, 2026
కాసేపట్లో గుంటూరు రానున్న సీఎం

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరికొద్ది సేపట్లో గుంటూరు రానున్నారు. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ బందోబస్తు చర్యలు చేపట్టింది. ఎస్పీ వకుల్ జిందాల్ బందోబస్తు ఏర్పాట్లతో పాటు హెలిప్యాడ్ ప్రాంతాన్ని పరిశీలించారు. అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఎస్పీతో పాటు డీఎస్పీ అజీజ్, తదితరులు ఉన్నారు.
News February 22, 2026
అమరావతిలో R-5 జోన్ రద్దు చేస్తూ నిర్ణయం

అమరావతిలో R-5 జోన్ రద్దు చేస్తూ CRDA నిర్ణయం తీసుకుంది. 900 ఎకరాల భూమిని తిరిగి CRDAకు అప్పగించాలని, R-5 జోన్లో గత ప్రభుత్వం వేసిన లేఅవుట్లు, భూ పంపిణీని CRDA రద్దు చేసింది. R-5 జోన్తో అమరావతి మాస్టర్ ప్లాన్కు ఇబ్బంది కలుగుతుందని CRDA భావిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. R-5 జోన్లో ఇళ్ల స్థలాలు కేటాయించిన వారికి వేరే ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు మంజూరుకు సిద్దమవుతుంది.
News February 22, 2026
GNT: కాంగ్రెస్ తీరుపై అంబటి తీవ్ర విమర్శలు

YSR మరణం తర్వాత ఆయన కుటుంబాన్ని కాంగ్రెస్ తీవ్రంగా వేధించిందని అంబటి రాంబాబు విమర్శించారు. రాజకీయ కక్షతోనే జగన్పై CBI, EDఅక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. అలాంటి కాంగ్రెస్ ఇప్పుడు YSRవారసత్వం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. జాతీయ ప్రయోజనాల విషయంలో తామెప్పుడూ రాజీపడలేదన్నారు. విదేశీ గడ్డపై దేశ పరువు తీయడం సరికాదని హితవు పలికారు. చంద్రబాబుతో కాంగ్రెస్ చీకటి ఒప్పందాలు అందరికీ తెలుసన్నారు.


