News February 25, 2025

పెదమేరంగిలో ఏనుగుల గుంపు బీభత్సం

image

జియ్యమ్మవలస మండలం పెదమేరంగిలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. మంగళవారం తెల్లవారుజామున ఏనుగుల గుంపు సాయి గాయత్రి మోడరన్ రైస్ మిల్ షట్టర్లను విరగగొట్టి లోపలకి చొరబడి ధాన్యం, బియ్యం నిల్వలను చెల్లాచెదురుగా చేశాయి. నెల రోజుల్లో 2 సార్లు ఇదే మిల్‌పై దాడి చేయడంతో సుమారు రూ.2 లక్షల వరకు ఆస్తి నష్టం వచ్చిందని బాధితులు వాపోతున్నారు.

Similar News

News February 25, 2025

WGL: ఎత్తుకు పైఎత్తులు.. మిగిలింది ఒక్కరోజే!

image

WGL-KMM-NLG ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా అభ్యర్థులు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. ప్రచారానికి ఒక్క రోజే మిగిలి ఉండటంతో ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఓటర్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇక కొంతమంది తాయిలాలు పంపిణీ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాగా కొంతమంది అభ్యర్థులు రెండో ప్రాధాన్యత ఓట్లపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

News February 25, 2025

జియో హాట్‌స్టార్‌కు పోటీగా.. ఎయిర్‌టెల్, టాటాప్లే జింగాలాలా..

image

జియో హాట్‌స్టార్ తర్వాత మీడియా, ఎంటర్‌టైన్మెంట్ రంగంలో మరో 2 కంపెనీలు విలీనం కాబోతున్నట్టు తెలిసింది. స్వాప్‌డీల్ ద్వారా భారతీ ఎయిర్‌టెల్ తమ DTH బిజినెస్ ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీని టాటా ప్లేతో మెర్జ్ చేయనుందని సమాచారం. ఎయిర్‌టెల్ 52-55%, టాటా 45-48% వాటా తీసుకుంటాయని తెలిసింది. ఇదే జరిగితే టాటా ప్లే‌కు ఉన్న 1.9 కోట్ల హోమ్స్, 5 లక్షల బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లు ఎయిర్‌టెల్ పరిధిలోకి వస్తాయి.

News February 25, 2025

మోడల్ స్కూల్ దరఖాస్తుల గడువు పెంపు

image

TG: మోడల్ స్కూళ్ల దరఖాస్తు గడువును మార్చి10వ వరకు పెంచినట్లు విద్యాశాఖ తెలిపింది. ఈనెల 28వ తేదీతో గడువు ముగుస్తుండగా మార్చి10 వరకు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం GO జారీ చేసింది. మోడల్ స్కూళ్లలో 6 నుంచి 10తరగతుల ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఫీజు ఓసీలు రూ.200, ఇతర వర్గాల వారు రూ.125 చెల్లించాల్సి ఉంటుంది. సైట్: https://telanganams.cgg.gov.in/

error: Content is protected !!