News March 13, 2025
పెద్దకొత్తపల్లి: గొంతులో అన్నం అడ్డొచ్చి శ్వాస ఆడక రైతు మృతి

అన్నం గొంతులో ఇరుక్కుని ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన పెద్దకొత్తపల్లి మండల పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు.. చంద్రకల్ గ్రామానికి చెందిన బండి గోవింద్ మద్యం తాగిన అనంతరం అన్నం తింటుండగా ముద్ద గొంతులో ఇరుక్కుని ఊపిరాడక మృతిచెందారు. మృతుడి కుమారుడు సిద్ధార్థ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పెద్దకొత్తపల్లి ఎస్ఐ సతీశ్ తెలిపారు.
Similar News
News March 13, 2025
పిల్లలను దండించే అధికారం గురువులకు లేదా?

1990, 2000లలో గురువులంటే పిల్లలకు ఎంతో గౌరవం, భయం ఉండేవి. పిల్లలు సరిగా చదవకున్నా, అల్లరి చేసినా మందలించమని తల్లిదండ్రులు టీచర్లకు చెప్పేవారు. వారి భరోసాతో ఉపాధ్యాయులు విద్యార్థులను దారిలోకి తెచ్చి మంచి పౌరులుగా తీర్చిదిద్దేవారు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పిల్లలపై చేయి వేద్దామంటేనే <<15742695>>ఉపాధ్యాయులు<<>> జంకాల్సిన పరిస్థితి. తల్లిదండ్రులకూ పిల్లలపై నియంత్రణ ఉండట్లేదు. మీ కామెంట్?
News March 13, 2025
సత్తమ్మ మృతదేహానికి నివాళులర్పించిన సీపీఐ నాయకులు

జనగామ డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి తల్లి సత్తమ్మ(87) గురువారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న పూర్వం చేర్యాల నియోజకవర్గం సీపీఐ నాయకులు మద్దూరు మండలం నర్సాయపల్లిలో స్వగృహంలో సత్తమ్మ మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల సీపీఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
News March 13, 2025
Q-కామర్స్లో 5.5 లక్షలమందికి కొలువులు!

భారత్లో క్విక్ కామర్స్ రంగం వచ్చే ఏడాది లోపు 5.5 లక్షల కొత్త కొలువుల్ని సృష్టించొచ్చని టీమ్లీజ్ సర్వీసెస్ అంచనా వేసింది. ‘క్యూ కామర్స్ రంగం శరవేగంగా విస్తరిస్తోంది. ఈ ఏడాది చివరికి 5 బిలియన్ డాలర్ల వ్యవస్థగా మారనుంది. వ్యాపార సంస్థలు తమ ఉద్యోగుల నైపుణ్యాల్ని మరింత మెరుగుపరచాలి’ అని ఓ నివేదికలో పేర్కొంది. బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ ఇన్స్టామార్ట్ వంటివి క్విక్ కామర్స్ సంస్థల కిందకు వస్తాయి.