News March 3, 2025

పెద్దకొత్తపల్లి: రెండు బైకులు ఢీ.. ఒకరు దుర్మరణం

image

పెద్దకొత్తపల్లి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన ఆదివారం రాత్రి జరిగింది. పోలీసుల వివరాలిలా.. సాతాపూర్ గ్రామ సమీపంలోని ప్రధాన రహదారిపై రెండు బైక్‌లు ఢీకొనగా ముష్టిపల్లికి చెందిన సాంబశివుడు అక్కడికక్కడే మృతిచెందాడు. కుడికిల్లకి చెందిన జగదీశ్ పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదైనట్లు ఎస్ఐ సతీష్ తెలిపారు.

Similar News

News February 18, 2026

ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం చేయాలి: WGL కలెక్టర్

image

ఈ నెల 25 నుంచి నిర్వహించనున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డా.సత్య శారద అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా 26 పరీక్షా కేంద్రాల్లో 12,166 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు తెలిపారు. కేంద్రాల వద్ద తాగునీరు, విద్యుత్, ఫర్నిచర్ వంటి కనీస వసతుల్లో లోటు ఉండకూడదని స్పష్టం చేశారు.

News February 18, 2026

SRPT: ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరి: కలెక్టర్ తేజస్

image

రైతులకు ప్రభుత్వ పథకాలు, రుణాలు అందాలంటే ‘ఫార్మర్ రిజిస్ట్రీ’ (అగ్రిస్టాక్) తప్పనిసరని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. బుధవారం జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. ఆధార్, పట్టాదారు పాస్ బుక్ వివరాలతో మీ-సేవా లేదా ఏఈఓల వద్ద నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ నెల 19 నుంచి 23 వరకు గ్రామాల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్లు తెలిపారు.

News February 18, 2026

గతంలో దారుణం.. ప్రస్తుతం ఎంతో ఘనం(1/2)

image

కోకో పంట ధర గతంలో ఎంతో దారుణంగా ఉండేది. కేజీ కోకో గింజలు రూ.80 ఉండగా ప్రస్తుతం కేజీ రూ.1000 పైబడి పలుకుతోంది. సీజన్, అన్ సీజన్ అని కాకుండా <<19178267>>కోకో పంటకు<<>> పూర్తి స్థాయిలో మార్కెట్ ఉండటంతో రైతులు ఈ పంట వైపు మొగ్గు చూపుతున్నారు. దేశంలో ప్రస్తుతం లక్ష టన్నుల డిమాండ్ ఉంటే కేవలం 25 వేల టన్నులే దేశంలో పండించగలుగుతున్నాం. దీన్ని బట్టి కోకోకు ఏమేరకు డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.