News March 17, 2025
పెద్దకొత్తపల్లి: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

పెద్దకొత్తపల్లి మండలం పరిధి దేవుని తిరుమల పూర్ గ్రామ సమీపంలో జరిగిన రోడు ప్రమాదంలో మహిళ అక్కడికక్కడే మృతిచెందిన ఘటన ఆదివారం జరిగింది. స్థానికుల వివరాలు.. మండలానికి చెందిన పీఏసీఎస్ వైస్ ఛైర్మన్ రాజు అతడి భార్య, కూతురు అనూషతో కలిసి వనపర్తి నుంచి బైక్పై వస్తున్నారు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న మరో బైక్ వీరిని ఢీకొట్టడంతో ముగ్గురూ కిందపడగా అనూష అక్కడికక్కడే చనిపోయింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News September 17, 2025
నిర్మల్: ‘రైతులు అధైర్య పడొద్దు.. ఆదుకుంటా’

రైతులు ఎవరూ అధైర్య పడొద్దని ప్రభుత్వం తరఫున అన్ని విధాలా ఆదుకుంటామని తెలంగాణ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ సిరిసిల్ల రాజయ్య అన్నారు. సోన్ మండలం కడ్తాల్ గ్రామంలో భారీ వర్షాలకు తెగిపోయిన పెద్ద చెరువు కట్టను బుధవారం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, డీసీసీ అధ్యక్షుడు శ్రీహరి రావుతో కలిసి ఆయన పరిశీలించారు. రైతులతో మాట్లాడి జరిగిన పంట నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు.
News September 17, 2025
ఆరోగ్యశ్రీ సేవలను కొనసాగించాలి: మంత్రి

TG: ఆరోగ్యశ్రీ సేవలను యథాతథంగా కొనసాగించాలని ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలను మంత్రి రాజనర్సింహ కోరారు. గత 9 ఏళ్లలో చేయని సమ్మె ఇప్పుడెందుకు చేయాల్సి వస్తోందని ప్రశ్నించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని, ప్రజలకు ఆరోగ్యశ్రీ సేవల్లో అంతరాయం ఉండదని స్పష్టం చేశారు. బకాయిలను చెల్లించాలనే డిమాండ్తో నెట్వర్క్ ఆస్పత్రులు ఇవాళ్టి నుంచి సేవలను <<17734028>>నిలిపివేసిన<<>> సంగతి తెలిసిందే.
News September 17, 2025
ఎన్టీఆర్: అమరావతి అసైన్డ్ రైతులకు ఊరట

రాజధాని అమరావతికి భూములిచ్చిన అసైన్డ్ రైతులకు ప్రభుత్వం ఊరటనిచ్చింది. CRDA వీరికిచ్చే రిటర్నబుల్ ఫ్లాట్ల ఓనర్షిప్ సర్టిఫికెట్లో “అసైన్డ్” అనే పదం తొలగించి పట్టా భూమి అనే పేర్కొంటామని బుధవారం ఉత్తర్వులిచ్చింది. ఇటీవల చంద్రబాబును కలసిన రైతులు అసైన్డ్ అని ఉన్న కారణంగా తమ ఫ్లాట్లకు తక్కువ ధర వస్తోందని చెప్పగా..సీఎం చంద్రబాబు ఓనర్షిప్ సర్టిఫికెట్లో మార్పులు చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు.