News February 18, 2025
పెద్దగట్టు జాతరలో స్వల్ప తొక్కిసలాట!

పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరలో మంగళవారం రాత్రి స్వల్ప తొక్కిసలాట జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మర్రిచెట్టుకు సమీపంలో పోలీస్ పాయింట్ వద్ద మున్సిపల్ చెత్త ట్రాక్టర్ రాకతో భక్తులు ఒకరినొకరు నెట్టుకోవటంతో స్వల్ప తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఎవరికి ప్రమాదం జరగలేదని స్థానికులు వెల్లడించారు. చిన్నారులు కాస్త ఇబ్బంది పడ్డారు.
Similar News
News February 21, 2025
NLG: ‘ఈసారి ఓవర్ లోడ్ సమస్యలే లేవు’

వేసవిలో విద్యుత్ సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని దక్షిణ తెలంగాణ పంపిణి సంస్థ సీఎండి ముషారఫ్ ఫరూకీ ఆదేశించారు. గురువారం ఆయన NLG కలెక్టర్ కలెక్టరేట్లో విద్యుత్ సరఫరాకు సంబంధించి “వేసవి కార్యాచరణ ప్రణాళిక” పై సమీక్ష నిర్వహించారు. గతేడాది FEB 20 నాటికి జిల్లాలో 66 సబ్ స్టేషన్లపై ఓవర్ లోడ్ ఉండేదని.. ఈసారి ఒక సబ్ స్టేషన్లో కూడా ఓవర్ లోడ్ లేదని తెలిపారు.
News February 21, 2025
వేసవి కార్యాచరణ ప్రణాళికపై కలెక్టర్ సమీక్ష

గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం సైతం జిల్లాలో తాగునీటికి సమస్యలు రాకుండా చూసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఎంపీడీవోలు, తహశీల్దారులను ఆదేశించారు. గురువారం ఆమె ఉదయాదిత్య భవన్లో తహశీల్దారులు, ఎంపీడీవోలతో వేసవి కార్యాచరణ ప్రణాళిక పై సమీక్ష నిర్వహించారు. ఎక్కడైనా తాగునీటి పైపులు, నల్లాలు తదితర అత్యవసర మరమ్మతులు ఉన్నట్లయితే గ్రామపంచాయతీ నిధుల నుంచి చేయించాలని ఆదేశించారు.
News February 20, 2025
పెద్దగట్టు జాతరకు వెళ్లి వస్తుండగా ఘోర ప్రమాదం

సూర్యాపేట జిల్లాలో గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఇద్దరు యువకులు పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరకు బైక్పై వెళ్లి వస్తుండగా సూర్యాపేట రూరల్ పరిధి కేసారం గ్రామం సమీపంలోని వాగులో పడ్డారు. ఈ ప్రమాదంలో కాసరాబాద్ గ్రామానికి చెందిన సుధీర్(21) మృతి చెందగా, సంపత్కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుణ్ని ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.