News February 12, 2025
పెద్దపల్లిలో మందకొడిగా పత్తి కొనుగోళ్లు!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739345938260_50031802-normal-WIFI.webp)
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని వ్యవసాయ పత్తి మార్కెట్లో కొనుగోళ్లు మందకొడిగా కొనసాగుతున్నాయి. పత్తికి కనీస మద్దతు ధర కూడా లభించకపోవడంతో రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత మార్కెట్లో క్వింటాల్ పత్తికి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర కంటే తక్కువ ధర మాత్రమే అందుతోందని రైతులు వాపోతున్నారు. ప్రస్తుతం పత్తికి క్వింటాకు రూ.6,811 చొప్పున పలుకుతోంది.
Similar News
News February 12, 2025
రేపు గ్రూప్-2 హాల్టికెట్లు విడుదల
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739355448835_81-normal-WIFI.webp)
AP: గ్రూప్-2 మెయిన్స్ పరీక్షల హాల్టికెట్లను రేపు విడుదల చేయనున్నట్లు APPSC తెలిపింది. ఫిబ్రవరి 23వ తేదీన ఉదయం, మధ్యాహ్నం రెండు పేపర్లకు ఆఫ్లైన్లో పరీక్షలు జరగనున్నాయి. ఉమ్మడి 13 జిల్లా కేంద్రాల్లో ఎగ్జామ్ సెంటర్లు ఉంటాయి. అభ్యర్థులు హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకుని, అందులోని సూచనలను గమనించాలని APPSC తెలిపింది. ఒకరోజు ముందుగానే కేటాయించిన పరీక్షా కేంద్రాన్ని చూసుకోవాలని సూచించింది.
News February 12, 2025
మేడిపల్లి: 2024లో ట్రాఫిక్ రూల్స్ బ్రేక్.. 292 మంది మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739325851755_15795120-normal-WIFI.webp)
ఘట్కేసర్, మేడిపల్లి, కీసర, మేడ్చల్, శామీర్పేట, జవహర్నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో 2024లో ఏకంగా 683 ప్రమాదాల్లో 292 మంది మృత్యుపాలయ్యారు. అనేక ప్రమాదాల్లో అతివేగంగా ప్రయాణించడం, హెల్మెట్, సీటు బెల్ట్ ధరించకపోవడం, రాంగ్ రూట్ కారణాలుగా పోలీసు అధికారులు తెలిపారు. రోడ్డు ప్రయాణంలో చేసే చిన్నపాటి తప్పిదం ప్రాణాలు తీస్తుందని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని సూచించారు.
News February 12, 2025
Stock Markets: లాభాలు నిలబెట్టుకోలేదు..
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738644358848_1199-normal-WIFI.webp)
బెంచ్మార్క్ సూచీలు నేడు స్వల్పంగా నష్టపోయాయి. నిఫ్టీ 23,045 (-26), సెన్సెక్స్ 76,171 (-122) వద్ద ముగిశాయి. ఒకానొక దశలో నిఫ్టీ 200, సెన్సెక్స్ 600 Pts మేర నష్టపోయి మళ్లీ పుంజుకోవడం గమనార్హం. PSU బ్యాంకు, ఫైనాన్స్, మెటల్ సూచీలు ఎగిశాయి. ఆటో, ఐటీ, ఫార్మా, రియాల్టి, హెల్త్కేర్, O&G సూచీలు ఎరుపెక్కాయి. బజాజ్ ఫిన్సర్వ్, ఎస్బీఐ లైఫ్, శ్రీరామ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, టాటా స్టీల్ టాప్ గెయినర్స్.