News January 25, 2025
పెద్దపల్లిలో శుక్రవారం నాటి ముఖ్యాంశాలు

1. మాజీ ఎమ్మెల్యే రాజమల్లు ప్రథమ వర్ధంతికి హాజరైన నేతలు 2. సుల్తానాబాద్ ప్రభుత్వ హాస్పిటల్, ఎంపీడీఓ ఆఫీస్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు 3. పోటీ పరీక్షల గడువు పొడిగింపు 4. జిల్లాలో జాతీయ బాలికల దినోత్సవ వేడుకలు 5. రైతు భరోసా దరఖాస్తుల ఆహ్వానం 6. దావోస్లో మంథని ఎమ్మెల్యే, మంత్రి శ్రీధర్ బాబు పర్యటన 7. జీవితంపై విరక్తి చెంది RDMలో వ్యక్తి ఆత్మహత్య 8. బంగారం దొంగిలించిన దుండగులను అరెస్టు చేసిన పోలీసులు
Similar News
News November 11, 2025
మణుగూరులో 4,000 ఉద్యోగాలకు జాబ్ మేళా

సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 19న మణుగూరులో జరగనున్న జాబ్ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. భద్రాద్రి స్టేడియంలో ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఈ మేళాకు 100కు పైగా కంపెనీలు హాజరవుతాయని తెలిపారు. ఈ మేళా ద్వారా 4,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
News November 11, 2025
రోడ్లపై గుంతలు లేకుండా చేయండి: చంద్రబాబు

AP: రోడ్డు ప్రమాదాల నివారణపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. హెల్మెట్, సీట్ బెల్టు లేకుండా వాహనం నడుపుతున్న వారికి అవగాహన కల్పించాలని, అవసరమైతే వారి మొబైల్స్కి సందేశాలు పంపాలన్నారు. రోడ్డు ప్రమాదాలు, తొక్కిసలాట, అగ్నిప్రమాదాలు వంటివి జరగకుండా నిర్మాణాత్మక ప్రణాళిక తయారు చేయాలని ఆదేశించారు. రోడ్లపై గుంతలు లేకుండా యుద్ధప్రతిపాదికన పనులు పూర్తి చేయాలన్నారు.
News November 11, 2025
సంగారెడ్డి: నేటి నుంచి జిల్లా స్థాయి ఖోఖో పోటీలు

సంగారెడ్డిలోని అంబేడ్కర్ స్టేడియంలో నేటి నుంచి రెండు రోజులపాటు జిల్లా స్థాయి ఖోఖో పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్జీఎఫ్ సెక్రటరీ శ్రీనివాస్ రావ్ సోమవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. మండల స్థాయిలో ఎంపికైన క్రీడాకారులందరూ జిల్లా స్థాయిలో పాల్గొనాల్సి ఉంటుందని అన్నారు. విద్యార్థులు హాజరయ్యే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు.


