News February 3, 2025

పెద్దపల్లిలో MLC కవిత పర్యటన

image

పెద్దపల్లి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు ఎమ్మెల్సీ కవిత నేడు పర్యటిస్తారని బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉష తెలిపారు. రంగాపూర్‌లో కార్మిక నాయకుడు కౌశిక్ హరి కూతురి వివాహానికి హాజరుకానున్నారన్నారు. మధ్యాహ్నం 12 గంటలకు జిల్లా కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం 12:15కు మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి నివాసంలో నిర్వహించే టీబీజీకేఎస్ నాయకుల ఆత్మీయ సమావేశంలో పాల్గొంటారన్నారు.

Similar News

News September 15, 2025

చొప్పదండి: పురుగుల మందు తాగి హోంగార్డు ఆత్మహత్య

image

చొప్పదండి మండలం రుక్మాపూర్ గ్రామానికి చెందిన ముద్దసాని కనకయ్య(46) ఆదివారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడు కరీంనగర్ కమిషనరేట్లో హోంగార్డుగా పనిచేస్తున్నాడని, ఆర్థిక పరిస్థితులు బాగాలేక ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పేర్కొన్నారు. చికిత్స నిమిత్తం అతడిని తరలించేలోపే మృతి చెందినట్లు వివరించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News September 15, 2025

30L తల్లి పాలను దానం చేసిన గుత్తా జ్వాల

image

భారత మాజీ బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల మంచి మనసు చాటుకున్నారు. తల్లి పాలకు దూరమైన శిశువులు అనారోగ్యం బారిన పడకుండా ఆమె తన పాలను దానం చేశారు. ఏప్రిల్‌లో బిడ్డను కన్న జ్వాల ఇప్పటివరకు దాదాపుగా 30L పాలను మిల్క్ బ్యాంక్‌కు అందించారు. ఈ విషయాన్ని ఆమె SM వేదికగా పంచుకున్నారు. ఇది చూసిన నెటిజన్లు జ్వాల విశాల హృదయానికి ఫిదా అవుతున్నారు. ఆమె అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారంటూ ప్రశంసిస్తున్నారు.

News September 15, 2025

విద్యాసంస్థలు జీవన వ్యవస్థలు: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

image

విద్యాసంస్థలు కేవలం భవనాలు కాదని, అవి దార్శనికత, విలువలు, ఉన్నత ప్రమాణాల కోసం నిరంతరం కృషి చేసే జీవన వ్యవస్థలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం నాలుగో స్నాతకోత్సవంలో ఆయన ప్రసంగించారు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం దేశ నిర్మాణానికి దోహదపడే గ్రాడ్యుయేట్లను తయారు చేస్తోందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ప్రొఫెసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.