News April 10, 2025
పెద్దపల్లి: అకాల వర్షం.. తడిసిన ధాన్యం!

పెద్దపల్లి జిల్లాలోని పలు మండలాల్లో అకాల వర్షం కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. బుధవారం రాత్రి 11 గంటలకు కురిసిన వర్షానికి వరి తడచిపోయింది. ముఖ్యంగా రామయ్యపల్లి, దొంగతుర్తి, గ్రామాల రైతులు ఇబ్బంది పడ్డారు. పైగా వరి కోతలు పూర్తి కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని కోరుతున్నారు.
Similar News
News February 25, 2026
చైనా అండతో USను టార్గెట్ చేసిన ఇరాన్!

మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలు మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ఇరాన్పై దాడి చేసేందుకు ఇప్పటికే అమెరికా యుద్ధనౌకలు ఆ దేశ తీరానికి సమీపంలో మోహరించాయి. దీనికి కౌంటర్గా ఇరాన్.. చైనా నుంచి సూపర్ సోనిక్ యాంటీ షిప్ క్రూయిజ్ మిస్సైల్స్ను కొనుగోలు చేయనుంది. ఇప్పటికే డీల్ దాదాపు పూర్తి కావొచ్చిందని ఇంటర్నేషనల్ మీడియా పేర్కొంది. వీటితో 290 కి.మీ దూరంలోని లక్ష్యాలను అటాక్ చేయవచ్చు. వాటిని అడ్డుకోవడం చాలా కష్టం.
News February 25, 2026
పోలవరంలో పెద్దపులి సమాచారం..అధికారుల తీరుపై అసహనం

పోలవరం జిల్లాలో పెద్దపులి సంచరించడం తెలిసిందే. అయితే అటవీశాఖ అధికారుల తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. పులిని దట్టమైన అటవిలో వదిలి ఉండాల్సిందని సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. అయితే అటవీశాఖ అధికారులు మాత్రం నల్లమల అటవీ ప్రాంతంలో ఇప్పటికే చాలా పులులు ఉండడం వల్ల ఇక్కడ వదలాల్సి వచ్చిందని, గతంలో పులి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో తిరిగినా ఎవరికి హాని చేయలేదని గుర్తు చేస్తున్నారు.
News February 25, 2026
BREAKING: పాలమూరు: ఇంటర్ స్టూడెంట్ సూసైడ్

ఇంటర్ విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. ఎస్ఐ విక్రమ్ తెలిపిన వివరాలు.. MBNR జిల్లా నవాబ్పేట్(M) చాకలిపల్లికి చెందిన పురుషోత్తం(19) యన్మంగండ్లలోని కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. ఈ క్రమంలో ఇంటర్ పరీక్షల నేపథ్యంలో చదువుపై శ్రద్ధ వహించడం లేదని కుటుంబీకులు ఇటీవల అతడిని మందలించారు. దీంతోపాటు ఇటీవల అతడి లవ్ కూడా ఫెయిలైందని మనస్తాపంతో ఉన్నాడు. ఈ క్రమంలో పురుగు మందు తాగి సూసైడ్ చేసుకున్నాడు.


