News March 11, 2025

పెద్దపల్లి: ఇంటర్మీడియట్ పరీక్షలకు నేడు 207 మంది గైర్హాజరు

image

పెద్దపల్లి జిల్లాలో మంగళవారం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా కొనసాగాయని జిల్లా ఇంటర్ నోడల్ అధికారి కల్పన తెలిపారు. గణితం, ఔషధశాస్రం, పొలిటికల్ సైన్స్ పేపర్లకు పరీక్షలు నిర్వహించామన్నారు. 5845 మంది విద్యార్థులకు గాను 5638 మంది విద్యార్థులు హాజరయ్యారని పేర్కొన్నారు. 207 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. గైర్హాజరైన వారిలో జనరల్ 137, వొకేషనల్ 70మంది ఉన్నారని తెలిపారు.

Similar News

News November 13, 2025

భారీగా పెరిగిన గోల్డ్, సిల్వర్ రేట్స్

image

నిన్న కాస్త తగ్గి రిలీఫ్ ఇచ్చిన గోల్డ్ రేట్స్ ఇవాళ భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10గ్రా. బంగారం రూ.2,290 పెరిగి రూ.1,27,800కు చేరింది. 22 క్యారెట్ల 10గ్రా. పసిడి రూ.2,100 ఎగబాకి రూ.1,17,150గా నమోదైంది. అటు వెండి ధర ఇవాళ కూడా భారీగా పెరిగింది. కేజీ సిల్వర్ రేట్ రూ.9వేలు పెరిగి రూ.1,82,000కు చేరింది.

News November 13, 2025

వేములవాడ: మూడుకు తగ్గిన VIP గెస్ట్ హౌస్‌లు..!

image

వేములవాడ రాజన్న ఆలయంలో VIP గెస్ట్ హౌస్‌ల సంఖ్య మూడుకు తగ్గిపోయింది. భీమేశ్వరాలయం పక్కన మొత్తం 5 గెస్ట్ హౌస్‌లు ఉండగా, ఇటీవలి మార్పులలో భాగంగా ఒకదాంట్లో PRO కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. మరోదాంట్లో లడ్డూ ప్రసాదాల తయారీ కేంద్రాన్ని కొనసాగిస్తున్నారు. ఫలితంగా రాజన్న భక్తుల కోసం మిగిలిన అతిథి గృహాల సంఖ్య మూడుకు తగ్గింది. ఆలయాభివృద్ధి పనుల నేపథ్యంలో కూల్చివేతల జరుగుతున్నందున ఈ మార్పులు జరుగుతున్నాయి.

News November 13, 2025

నాలుగు ప్రధాన నగరాల్లో పేలుళ్లకు కుట్ర: నిఘా వర్గాలు

image

‘ఢిల్లీ పేలుడు’పై దర్యాప్తు చేపట్టిన అధికారులకు విస్తుపోయే విషయాలు తెలుస్తున్నాయి. 8 మంది ఇద్దరిద్దరుగా విడిపోయి 4 ప్రధాన నగరాల్లో పేలుళ్లకు కుట్ర పన్నారని సమాచారం. ప్రతి గ్రూప్ భారీగా IED తీసుకెళ్లాలని నిర్ణయించారని, పేలుళ్ల కోసం 20 క్వింటాళ్లకు పైగా ఎరువులను సేకరించినట్లు తెలిసింది. మరోవైపు ఢిల్లీ బ్లాస్ట్‌కు ముందు ఉమర్‌కు రూ.20 లక్షల డబ్బు అందిందని నిఘా వర్గాలు గుర్తించాయి.