News August 15, 2024

పెద్దపల్లి: ఈ సారు టాలెంట్‌కు ఫిదా అవ్వాల్సిందే

image

అగ్గిపుల్ల సబ్బుబిళ్ల కాదేది కళకు అనర్హం అన్నట్టు సూక్ష్మకళలో రాణిస్తున్నాడు పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం మడకకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆడెపు రజనీకాంత్. బ్లాక్ బోర్డుపై రాసేందుకు మాత్రమే ఉపయోగించే చాక్ పీస్‌పై 78 జాతీయ పతాకాలు చెక్కి ఆకట్టుకుంటున్నారు. ఇదివరకు కూడా రెండు బియ్యపు గింజలపై, 8 సెంటీమీటర్ల చాక్ పీస్‌పై 284 ఇంగ్లిష్ అక్షరాలతో జాతీయ గీతాన్ని చెక్కి ప్రశంసలు అందుకున్నారు.

Similar News

News December 31, 2025

KNR: న్యూఇయర్ సెలబ్రేషన్‌లో నిబంధనలు కఠినం

image

నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో సీపీ గౌష్ ఆలం ఆంక్షలు విధించారు. బుధవారం రాత్రి 8 నుంచి గురువారం ఉదయం 8 వరకు 163 బీఎన్ఎస్ఎస్ చట్టం అమలులో ఉంటుందని, ఐదుగురు కంటే ఎక్కువ మంది గుమికూడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. నగరంలోకి భారీ వాహనాల ప్రవేశాన్ని నిషేధించారు. డీజేలు, బాణసంచా వాడకూడదని, డ్రంకెన్ డ్రైవ్, ట్రిపుల్ రైడింగ్‌పై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.

News December 31, 2025

జమ్మికుంట: నిలకడగానే పత్తి గరిష్ఠ ధర

image

జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో పత్తి గరిష్ఠ ధర నిలకడగానే ఉంది. బుధవారం యార్డుకు 23 వాహనాల్లో 203 క్వింటాళ్ల విడి పత్తిని రైతులు తీసుకొని రాగా.. గరిష్ఠంగా క్వింటాకు రూ.7,400, కనిష్ఠంగా రూ.6,900లకు ప్రైవేట్ వ్యాపారులు బహిరంగ వేలం ద్వారా కొనుగోలు చేశారు. మార్కెట్ కార్యకలాపాలను ఉన్నత శ్రేణి కార్యదర్శి రాజా పరిశీలించారు.

News December 31, 2025

KNR: ఆన్‌లైన్ బెట్టింగ్ భూతానికి మరో యువకుడు బలి

image

ఆన్‌లైన్ బెట్టింగ్‌ల ఉచ్చులో చిక్కుకుని ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. తోట ఆదిత్య(34) ఆన్‌లైన్ బెట్టింగ్‌ల వల్ల ఏర్పడిన సమస్యలతో మనస్తాపానికి గురై తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు.