News October 14, 2025
పెద్దపల్లి: ‘ఉపాధ్యాయులు అవగాహన కలిగి ఉండాలి’

పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష కలెక్టరేట్లో మంగళవారం ఉపాధ్యాయుల శిక్షణలో మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో థింక్- పేర్-షేర్ విధానం అమలు ద్వారా మౌనంగా, ఇన్యాక్టివ్గా ఉన్న విద్యార్థుల్ని బోధనలో భాగస్వామ్యం చేసేందుకు అవకాశం కలుగుతుందని తెలిపారు. విధానంపై ఉపాధ్యాయులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని, సందేహాలు శిక్షణలో నివృత్తి చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Similar News
News October 15, 2025
సిరిసిల్ల: జాతీయ సీపీఆర్ అవగాహన వారోత్సవాలు

జాతీయ సీపీఆర్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా ఈనెల 13 నుంచి 17 వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. సిరిసిల్లలో మంగళవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. సిరిసిల్లలోని ప్రభుత్వ కళాశాలలు, హైస్కూలలో ఈ జాతీయ సీపీఆర్ అవగాహన వారోత్సవాలను నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు.
News October 15, 2025
భూసేకరణ పూర్తి చేయండి: కలెక్టర్

కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ఏలూరు పవర్ పేట గేటు వద్ద, దెందులూరు (M) సీతంపేట- శ్రీరామవరం, భీమడోలు రైల్వే గేట్, పూళ్ల, కైకరం, చేబ్రోలు, ఉంగుటూరు స్టేషన్ వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి, రైల్వే అండర్ బ్రిడ్జిల నిర్మాణాలకు సంబంధించి భూ సేకరణను పూర్తి చేయాలని ఆదేశించారు. ఎటువంటి అభ్యంతరాలు, శాంతిభద్రతల సమస్యలు ఉండకూడదన్నారు.
News October 15, 2025
జమ్మికుంట: నిలకడగానే పత్తి గరిష్ట ధర

జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో పత్తి గరిష్ట ధర నిన్నటి లాగానే నిలకడగానే ఉంది. మంగళవారం యార్డుకు 951 క్వింటాళ్ల విడిపత్తిని రైతులు తీసుకొని రాగా.. గరిష్టంగా క్వింటాకు రూ.6,400, కనిష్టంగా రూ.5,000 ధర పలికింది. గోనెసంచుల్లో 38 క్వింటాళ్లు తీసుకొని రాగా గరిష్టంగా రూ. 6,000 ధర లభించింది. మార్కెట్ కార్యకలాపాలను మార్కెట్ చైర్ పర్సన్ పుల్లూరి స్వప్న, ఉన్నత శ్రేణి కార్యదర్శి మల్లేశం పరిశీలించారు.