News July 9, 2025
పెద్దపల్లి: గానుగ వృత్తి పరిరక్షణకు ప్రభుత్వం కృషి: మంత్రి

తెలంగాణ కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన గడ్డం వివేక్ను గానుగ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు డా.లెక్కల నాగేశ్ ఈరోజు పెద్దపల్లిలో మర్యాదపూర్వకంగా కలిశారు. గానుగ వృత్తి పరిరక్షణ, గాండ్ల యువతకు నైపుణ్య శిక్షణ, సబ్సిడీతో గానుగలు, గాండ్ల కార్పొరేషన్ ఏర్పాటుపై వినతిపత్రం అందించారు. మంత్రి సానుకూలంగా స్పందిస్తూ కుల వృత్తుల పరిరక్షణకు ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.
Similar News
News July 10, 2025
మంచిర్యాల జిల్లా అధికారులతో DPO సమావేశం

జిల్లా పంచాయతీ అధికారి D.వెంకటేశ్వరరావు అధ్యక్షతన డివిజన్ పంచాయతీ అధికారులు, మండల పంచాయతీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. లేఅవుట్, గృహ నిర్మాణ అనుమతులు, మ్యుటేషన్, ట్రేడ్ లైసెన్స్కు సంబంధించిన దరఖాస్తులను పరిశీలించాలన్నారు. ప్లాంటేషన్, గ్రామపంచాయతీల తనిఖీలు, ఇన్ఫాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్లాన్, పంచాయతీ కార్యదర్శుల అటెండెన్స్, DSR గురించి సమీక్షించారు.
News July 10, 2025
కల్తీ కల్లు ఘటనలో బాధితుల వివరాలు

బాలానగర్ ఎక్సైజ్ PS పరిధిలో కల్తీ కల్లు తాగి అస్వస్థతకు గురై నిమ్స్తో పాటు రాందేవ్రావ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి వివరాలను విడుదల చేశారు. నిమ్స్లో 27 మంది చికిత్స పొందుతుండగా కూకట్పల్లిలోని రాందేవ్దేవ్రావు ఆస్పత్రిలో ఒకరు చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. అందరికీ మెరుగైన చికిత్స అందించడంతోపాటు ఎప్పటికప్పుడు ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నారు.
News July 10, 2025
జగిత్యాల జిల్లా ప్రెస్క్లబ్ అధ్యక్షుడిగా శ్రీనివాసరావు

జగిత్యాల జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా చీటీ శ్రీనివాసరావు విజయం సాధించారు. పట్టణంలోని సుమంగళి గార్డెన్లో బుధవారం నిర్వహించిన ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. ఇందులో తన సమీప అభ్యర్థి బండ స్వామిపై 73 ఓట్ల మెజార్టీతో శ్రీనివాస్ రావు విజయం సాధించారు. అలాగే ప్రధాన కార్యదర్శిగా సంపూర్ణ చారి, ట్రెజరర్గా సిరిసిల్ల వేణుగోపాల్ ఎన్నికయ్యారు.