News March 30, 2025

పెద్దపల్లి జిల్లాలోని టాప్ న్యూస్

image

@ రామగుండం: బ్యాంకాక్ నుంచి రామగుండం చేరుకున్న ఎమ్మెల్యే ఫ్యామిలీ@ పెద్దపల్లి: విద్యుత్ ప్రమాదాలు జరగకుండా అవగాహన@ పెద్దపల్లి: పరువు హత్య కేసులో ముగ్గురుపై కేసు నమోదు@ఓదెల: వ్యవసాయం, పర్యావరణ పై విద్యార్థులకు అవగాహన@ రామగిరి: రాజాపూర్ ప్రజలకు మంత్రి శ్రీధర్ బాబు భరోసా@ ధర్మారం: జిల్లా అధికారులతో ఎమ్మెల్యే అడ్లూరి భేటీ@ కమాన్పూర్: తాసిల్దార్ భవనానికి శంకుస్థాపన చేసిన మంత్రి శ్రీధర్ బాబు

Similar News

News March 2, 2026

GWL: పోలీస్ ప్రజావాణి కి 12 ఫిర్యాదులు-ఎస్పీ శ్రీనివాసరావు

image

గద్వాల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 12 ఫిర్యాదులు వచ్చినట్లు ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. కొడుకు అన్నం పెట్టడం లేదని 1, గుంటూరు ఏసి గోదాంలో మిర్చి బస్తాలు మాయంపై 1, భూ వివాదాలపై 1, ప్లాట్ల వివాదాలకు సంబంధించిన 4, భార్యాభర్తల గొడవలకు సంబంధించి 1, ఇతర సమస్యలకు సంబంధించిన 4 ఫిర్యాదులు వచ్చాయన్నారు. వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి వెంటనే పరిష్కరించాలని సూచించారు.

News March 2, 2026

మార్చి 31లోగా లక్ష్యాలను పూర్తి చేయాలి: కలెక్టర్

image

ఆర్థిక సంవత్సరం ముగియనున్న తరుణంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల ఫిర్యాదులను స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, ముఖ్యంగా LRS దరఖాస్తుల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. మార్చి 31 లోగా నిర్దేశిత లక్ష్యాలన్నింటినీ పూర్తి చేయాలని ఆదేశించారు.

News March 2, 2026

విజయవాడ: కలెక్టరేట్ PGRSకు 174 వినతులు

image

NTR కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్‌కు మొత్తం 174 అర్జీలు అందినట్లు కలెక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు. ఇందులో రెవెన్యూ శాఖకు సంబంధించి 66, పురపాలక 26, పోలీస్ శాఖకు 18 వినతులు వచ్చాయి. ప్రతి అర్జీని నిర్దిష్ట గడువులోగా పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. పారదర్శకమైన సేవలందించడంలో నిర్లక్ష్యం వహించవద్దని ఆయన స్పష్టం చేశారు.