News February 12, 2026
పెద్దపల్లి జిల్లాలో ఓవరాల్ పోలింగ్ శాతం ఎంతంటే…

జిల్లాలోని నాలుగు పురపాలికలకు బుధవారం జరిగిన ఎన్నికల్లో ఓవరాల్గా 75.28 శాతం పోలింగ్ నమోదయింది. రామగుండం కార్పొరేషన్లో 69.32%, పెద్దపల్లి పురపాలక సంఘం 73.54%, సుల్తానాబాద్ పురపాలక సంఘంలో 81.53%, మంథని పురపాలక సంఘం పరిధిలో 76.76% ఓటింగ్ నమోదయింది. కాగా రేపు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
Similar News
News February 12, 2026
‘టీ’ని మళ్లీ వేడి చేస్తున్నారా.. ఇది మీ కోసమే!

చల్లారిన టీని మళ్లీ వేడి చేయడం ఆరోగ్యానికి హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘రీహీట్ వల్ల చాయ్ చేదుగా, అసిడిటిక్గా మారుతుంది. కడుపులో తిప్పడం, అసిడిటీ, హార్ట్బర్న్, ఛాతీలో మంట ఏర్పడొచ్చు. అందులో చేరుకున్న బాక్టీరియా వల్ల కడుపు నొప్పి, వాంతులు, ఫుడ్ పాయిజన్ కావొచ్చు. తాజా టీతో పోలిస్తే యాంటీఆక్సిడెంట్లు తగ్గుతాయి. అందుకే ఫ్రెష్గా తాగండి. వాడిన పొడిని మళ్లీ వాడొద్దు’ అని చెబుతున్నారు.
News February 12, 2026
MBNR: అందరి చూపు అటువైపే..

మున్నిపల్ ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఇక అందరి చూపు రేపటి ఓట్ల లెక్కింపుపైనే ఉంది. ఓట్లు బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం కావడంతో గెలుపోటములపై అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. బయటకు తామే గెలుస్తామని చెప్పుకుంటున్నా.. సర్వేల్లో విభిన్న ఫలితాలు రావడం, పోలింగ్ తర్వాత అభ్యర్థులు డైలమాలో పడినట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో చాలాచోట్ల ద్విముఖ, త్రిముఖ పోరు, బలమైన నాయకులు ఉండటంతో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది.
News February 12, 2026
విశాఖ: సహజీవన భాగస్వామిని హత్య చేసిన మహిళ?

ఆనందపురం శివారున పందుల పాక వద్ద <<19110634>>నాగశివ<<>> (38) అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. సమాచారం అందుకున్న పోలీసులు బుధవారం ఘటనా స్థలిని పరిశీలించారు. నాగశివ ఒంటిపై గాయాలు ఉండడంతో హత్యకు గురయ్యాడా అనే కోణంలో విచారణ చేపట్టారు. రాజమండ్రి ప్రాంతానికి చెందిన నాగశివ ముబీనా అలియాస్ శ్రావణి (41)తో సహజీవనం చేస్తున్నాడు. మద్యం మత్తులో వీరిద్దరి మధ్య గొడవ జరగడంతో శ్రావణి దాడి చేసి చంపినట్లు సమాచారం.


