News February 4, 2025
పెద్దపల్లి: జిల్లాలో ముగ్గురు తహశీల్దార్ల బదిలీ

పెద్దపల్లి జిల్లాలో శ్రీరాంపూర్ తహశీల్దార్ MD. వకీల్, ఓదెల తహశీల్దార్ యాకన్న, ధర్మారం తహశీల్దార్ అరీఫుద్దీన్ లను బదిలీ చేస్తూ కలెక్టర్ కోయ శ్రీహర్ష ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టరేట్ కార్యాలయంలో సూపరింటెండెంట్లు గా పనిచేస్తున్న పి.జగదీశ్వరరావును శ్రీరాంపూర్, జె.సునీతను ఓదెల తహశీల్దారుగా నియమించారు. శ్రీరాంపూర్ తహశీల్దార్ వకీల్ను ధర్మారం తహశీల్దారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.
Similar News
News November 4, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News November 4, 2025
లాజిస్టిక్ కారిడార్తో అభివృద్ధి: చంద్రబాబు

APలో అంతర్గత జల రవాణాకు పుష్కలంగా అవకాశాలున్నాయని CM చంద్రబాబు పేర్కొన్నారు. లండన్లో పారిశ్రామికవేత్తలతో ఆయన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. లాజిస్టిక్ కారిడార్తో APని అభివృద్ధి చేసే ప్రణాళికలు రచిస్తున్నట్లు వారికి వివరించారు. ఈ సందర్భంగా ఆయా సంస్థలతో పారిశ్రామిక అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. జల రవాణాపై పని చేసేందుకు ముందుకు రావాలని లండన్లోని అరుప్ సంస్థను CM కోరారు.
News November 4, 2025
చేవెళ్ల: 19 మందిని పొట్టన పెట్టుకున్న టిప్పర్ ఇదే..!

మీర్జాగూడలో జరిగిన రోడ్డుప్రమాదంలో 19మందిని పొట్టనపెట్టుకున్న టిప్పర్పై 2చలాన్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అక్రమంగా నిషేధిత సమయాల్లో భారీ లోడ్తో నగరంలోకి ఎంట్రీ ఇవ్వడంతో ఈ ఏడాది ఫిబ్రవరి, సెప్టెంబర్లో చందానగర్, RCపురంలో HYD పోలీసులు చలాన్లు విధించారు. అనిత అనే పేరుతో రిజిస్ట్రేషన్ అయిందని అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో మోతాదుకు మించిన కంకరలోడు ఉండడంతోనే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు.


