News January 26, 2025
పెద్దపల్లి జిల్లాలో 2,196 ఎకరాల సాగుకు యోగ్యం కానీ భూమి: కలెక్టర్

పెద్దపెల్లి జిల్లాలో 2,196 ఎకరాల భూమి సాగుకు యోగ్యం కాని భూమిని గుర్తించినట్టు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. మిగిలిన వ్యవసాయ యోగ్యమైన భూమికి యాసంగి పంటకు పెట్టుబడి సాయం అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు. జిల్లాలో 58 వేల ఎనిమిది వందల తొంబై ఆరు మంది రైతులకు రూ.446.54 కోట్ల మేర రుణమాఫీ జరిగిందన్నారు. సన్నారకం ధాన్యానికి క్వింటాల్కు రూ.500 చొప్పున బోనస్ 26,652 మంది రైతులకు అందించామన్నారు.
Similar News
News July 7, 2025
పులివెందుల: స్తంభంపైనే చనిపోయాడు

పులివెందులలో విషాద ఘటన జరిగింది. మున్సిపాలిటీ పరిధిలోని ఉలిమెళ్ల సమీపంలో కరెంట్ పనులు చేయడానికి లైన్మెన్ శివారెడ్డి ఎల్సీ తీసుకున్నాడు. స్తంభంపై పనిచేస్తుండగా షాక్ కొట్టడంతో అక్కడే చనిపోయాడు. అధికారుల నిర్లక్ష్యంతో కరెంట్ సరఫరా జరిగిందా? వేరే కారణమా? అనేది తెలియాల్సి ఉంది.
News July 7, 2025
రైల్వే స్టేషన్లో మహిళకు ప్రసవం.. ఆర్మీ వైద్యుడిపై ప్రశంసలు

UPలోని ఝాన్సీ రైల్వే స్టేషన్లో ఓ నిండు చూలాలికి ఆర్మీ డాక్టర్ మేజర్ రోహిత్ పురుడు పోసి మానవత్వం చాటారు. పన్వేల్ నుంచి గోరఖ్పూర్ వెళ్తున్న రైలులో గర్భిణికి పురిటి నొప్పులు వచ్చాయి. అదే మార్గంలో HYD వెళ్లే రైలు కోసం వేచి ఉన్న రోహిత్ విషయం తెలియగా రైల్వే సిబ్బంది సహకారంతో ఆమెకు సురక్షితంగా డెలివరీ చేశారు. అనంతరం తల్లి, బిడ్డను ఆసుపత్రికి తరలించారు. దీంతో ఆర్మీ వైద్యుడిని అందరూ ప్రశంసిస్తున్నారు.
News July 7, 2025
చిత్తూరు జిల్లాలో యూరియా కొరత లేదంట..!

చిత్తూరు జిల్లాలో ఖరీఫ్ సీజన్కు 9896 Mtsల యూరియా అవసరమని అధికారులు అంచనా వేశారు. జిల్లాలో 10514 mtsల యూరియా నిల్వ చేయగా 6032 mtsలను ఇప్పటి వరకు రైతులు తీసుకెళ్లారు. 4200 Mts యూరియా అందుబాటులో ఉంది. గోడౌన్లో 1852 Mts, ప్రైవేట్ డీలర్స్ దగ్గర 1300Mts, RSKలలో 738 Mts, కంపెనీ గోడౌన్లో 300Mts మేర నిల్వ ఉండటంతో యూరియా కొరత రాదని చిత్తూరు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళీకృష్ణ Way2Newsకు తెలిపారు.