News December 12, 2025
పెద్దపల్లి జిల్లాలో FINAL పోలింగ్ శాతం

పెద్దపల్లి(D)లో 5 మండలాల్లోని 99 పంచాయతీల్లో గురువారం మొదటివిడత ఎన్నికలు జరిగాయి. మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ ముగియగా సమయానికి కేంద్రంలోపలికి వచ్చి క్యూలైన్లో నిలబడిన వారందరికీ ఓటేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. దీంతో జిల్లాలో ఫైనల్గా 82.24 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు ప్రకటించారు. కాల్వశ్రీరాంపూర్ 83.06, ముత్తారం 82.75, రామగిరి 77.96, కమాన్పూర్ 83.59, మంథనిలో 84.39 పోలింగ్ నమోదైంది.
Similar News
News December 12, 2025
కడప: ఇక 6 రోజులే గడువు..

కడప YVU పరిధిలోని అనుబంధ కళాశాలల్లో నాలుగో సంవత్సరంలో ప్రవేశానికి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు వైవీయూ డైరెక్టర్ డా. టీ. లక్ష్మీప్రసాద్ తెలిపారు. ఈ నెల 12 నుంచి 18వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు. మూడు సంవత్సరాల డిగ్రీ పూర్తి చేసుకున్న విద్యార్థులు నాలుగు సంవత్సరాల యు.జీ కోర్సుకు అర్హులన్నారు. వివరాల కోసం www.yvu.edu.in ను సంప్రదించవచ్చన్నారు.
News December 12, 2025
కరీంనగర్ జిల్లాలో ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలిచిందంటే..?

కరీంనగర్ జిల్లాలో తొలి విడత సర్పంచ్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం కనబరిచింది.
చొప్పదండి: 16 GPలకు కాంగ్రెస్ 8 , BRS 6 , ఇతరులు 2
గంగాధర:33 GPలకు కాంగ్రెస్ 9 ,BRS 3 ,BJP 9, ఇతరులు 9
కరీంనగర్ రూరల్: 14 GPలకు కాంగ్రెస్ 6 , BRS 1 , BJP 4 , ఇతరులు 2
కొత్తపల్లి: 6 GPలకు కాంగ్రెస్ 1 , BRS 2 , BJP 1 , ఇతరులు 2
రామడుగు: 23 GPలకు కాంగ్రెస్ 9 , BRS 4 , BJP 5 , ఇతరులు 4
News December 12, 2025
విశాఖలో మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బార్

విశాఖలో మంత్రి నారా లోకేష్ శుక్రవారం విశాఖ పార్టీ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. స్టీల్ ప్లాంట్ టౌన్ షిప్లో గత 40 ఏళ్లుగా నిర్వహిస్తున్న విశాఖ విమల విద్యాలయాన్ని ఏకపక్షంగా మూసివేయడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పలువురు ఆవేదన చెందారు. రెగ్యులర్ స్టాఫ్కు స్టీల్ ప్లాంట్లో ఉద్యోగ అవకాశం ఇవ్వాలని కొందరు విజ్ఞప్తి చేశారు. తన తండ్రి ఇంటిని ఆక్రమించారని, న్యాయం చేయాలని ఒకరు కోరారు.


