News December 4, 2025
పెద్దపల్లి: ట్రాక్టర్ను ఢీకొని వ్యక్తి మృతి

PDPL(D) ధర్మారం మండలం నాయికంపల్లి తండాకు చెందిన నవనందుల రాజేశ్(36) గోదావరి స్నానం చేసి బైక్పై ఇంటికి వస్తుండగా పత్తిపాక డాంబర్ ప్లాంట్ వద్ద నిలిపి ఉన్న ట్రాక్టర్ను ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. ఈయనతో పాటు ఉన్న అరవెండి కిష్టయ్య(45), మంగారపు సాయికుమార్(30)కు తీవ్ర గాయాలయ్యాయి. వారిని 108లో కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. CI ప్రవీణ్ కుమార్, SI ప్రవీణ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
Similar News
News December 4, 2025
BNGR: 10 పంచాయతీలు ఏకగ్రీవం

పంచాయతీ తొలివిడత ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల లెక్కతేలింది. బుధవారం నామినేషన్ల ఉపసంహరణ అనంతరం అధికారులు పోటీలో ఉన్న అభ్యర్థులను ప్రకటించి.. గుర్తులు కేటాయించారు. భువనగిరి రెవెన్యూ డివిజన్ పరిధిలోని 6 మండలాల్లోని 153 గ్రామాల్లో మొదటి విడత ఎన్నికలు జరుగుతుండగా.. వీటిలో 10 గ్రామాల్లో సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బరిలో ఉన్న అభ్యర్థులకు ఈనెల 11న ఎన్నికలు జరగనున్నాయి.
News December 4, 2025
డ్రై స్కిన్ కోసం మేకప్ టిప్స్

పొడి చర్మం ఉన్నవారు మేకప్ వేసుకోవాలనుకుంటే ముందుగా సీరం అప్లై చేయాలి. మాయిశ్చరైజర్ కచ్చితంగా అవసరం. చర్మం పొడిగా, డీహైడ్రేటెడ్గా ఉంటే.. హైడ్రేటింగ్ ప్రైమర్ను ఎంచుకోవాలి. ఇది మీ మేకప్ లుక్ని హైడ్రేటింగ్ బేస్గా ఉపయోగించవచ్చు. పొడి చర్మం కోసం ఫౌండేషన్ ఎంచుకునేటప్పుడు హైడ్రేటింగ్, తేలికైన, మెరిసే లిక్విడ్ ఫౌండేషన్ను ఎంచుకోవాలి. ఫౌండేషన్ పైన క్రీమ్ బ్లష్, హైలైటర్లను ఉపయోగించాలి.
News December 4, 2025
ఉమ్మడి గుంటూరు జిల్లాలో నేడు 7 DDO కార్యాలయాల ప్రారంభం

ఏపీలో స్థానిక సంస్థల బలోపేతం దిశగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా DDO (divisional development office)లను గురువారం ప్రారంభించనున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో రూ.1.15కోట్లతో ఏడు DDO కార్యాలయాలు ప్రారంభం కానున్నాయి. స్థానికంగా పాలనతో పాటు అభివృద్ధి, నిధులు, గ్రామాల్లో మౌలిక వసతులు కల్పన సులభతరం అవుతుంది. ఆర్డీవో మాదిరిగా డీడీవో వ్యవస్థ ఉండనుంది.


