News February 23, 2025
పెద్దపల్లి: తండ్రిని చంపిన కొడుకు

HYDకుషాయిగూడ PS పరిధిలో శనివారం కన్నతండ్రిని ఓ కొడుకు హత్యచేశాడు. PDPL(D) కాల్వశ్రీరాంపూర్(M) వెన్నంపల్లికి చెందిన అరెల్లి మొగిలి(45) జీవనోపాధి కోసం నగరానికి వలసవచ్చి లాలాపేటలో ఉంటున్నాడు. మద్యానికి బానిసైన మొగిలి నిత్యం తాగొచ్చి కుటుంబసభ్యులను డబ్బులకోసం వేధించసాగాడు. విసిగిపోయిన కొడుకు సాయికుమార్ తండ్రిని ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నాడు. ECIL బస్టాండ్ వద్ద అందరు చూస్తుండగానే నిన్న హత్యచేశాడు.
Similar News
News July 7, 2025
అన్నమయ్య: భార్య కాపురానికి రాలేదని సూసైడ్

అన్నమయ్య జిల్లాలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. గాలివీడు(M) మల్లసానివాళ్లపల్లెకు చెందిన తుపాకుల గోపాల్(37)కు పెద్దమండ్యానికి చెందిన రమణమ్మతో పదేళ్ల కిందట పెళ్లి జరగ్గా నలుగురు పిల్లలు ఉన్నారు. గోపాల్ మద్యానికి బానిసై కుటుంబాన్ని పట్టించుకోవడం లేదు. దీంతో రమణమ్మ పుట్టింటికి వెళ్లింది. ఆమె కాపురానికి రావడం లేదని, తాను చనిపోతానని తల్లిదండ్రులకు గోపాల్ చెప్పాడు. తన ఇంట్లోనే ఉరేసుకున్నాడు.
News July 7, 2025
ఆదిలాబాద్: కంట్లో కారం చల్లి, బండరాళ్లతో కొట్టి హత్య

లక్ష్మిపూర్ అటవీ ప్రాంతంలో <<16964169>>మహిళ <<>>మృతదేహం ఆదివారం లభ్యమైన విషయం తెలిసిందే. ఇంద్రవెల్లి(M) నర్సాపూర్ వాసి వందన(45), ADB వాసి శంకర్ను పెళ్లిచేసుకుంది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఎలాగైనా చంపాలని భావించి ఈనెల 2న లక్ష్మిపూర్ అటవీ ప్రాంతానికి తీసుకుని వెళ్లాడు. కంట్లో కారం చల్లి, తలపై బండరాళ్లతో కొట్టి హత్యచేశాడు. తండ్రిపై అనుమానంతో కూతురు PSలో ఫిర్యాదు చేయగా హత్య చేసినట్లు శంకర్ అంగీకరించాడు.
News July 7, 2025
కరీంనగర్ జిల్లాలో ఉన్నత స్థానాల్లో మల్యాల వాసులు

మల్యాలకు చెందిన ఇరువురు వ్యక్తులు ఉన్నత స్థాయి ఉద్యోగాలతో కరీంనగర్ జిల్లాలో విధులు నిర్వహిస్తున్నారు. మల్యాలకు చెందిన వాసాల సతీష్ కుమార్ కరీంనగర్ పోలీస్ కమిషనరేట్లో అసిస్టెంట్ కమిషనర్గా, అలాగే సీనియర్ న్యాయవాది మల్యాల ప్రతాప్ కరీంనగర్ కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్గా విధులు నిర్వహిస్తున్నారు. మండల కేంద్రానికి చెందిన వీరిరువురు ఉన్నత స్థానాల్లో ఉండడం పట్ల మల్యాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.