News February 26, 2025
పెద్దపల్లి: తండ్రిని హత్య చేసిన కొడుకుకు యావజ్జీవం

తండ్రిని చంపిన కొడుకుకు కోర్టు యావజ్జీవం విధించింది. SI శ్రావణ్ తెలిపిన వివరాలు.. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం కాచాపూర్ వాసి నర్సయ్య కుటుంబం సుల్తానాబాద్ పరిధి పూసాల గ్రామంలో నివాసం ఉంటోంది. అతడి పెద్దకొడుకు రాజేశం(40) 20 ఏళ్ల క్రితం హత్యాయత్నం కేసులో జైలుకు వెళ్లి వచ్చాడు. కాగా 2023 DEC 8న క్షణికావేశంలో తండ్రిని చంపేశాడు. కోర్టు రాజేశానికి యావజ్జీవ శిక్షతో పాటు రూ. 5వేల జరిమానా విధించింది.
Similar News
News February 21, 2026
నల్లజర్ల: కానిస్టేబుల్ను ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు

నల్లజర్ల మండలం పుల్లలపాడు జాతీయ రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. విధులు నిర్వహిస్తున్న బీట్ కానిస్టేబుల్ రవిని ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వేగంగా ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనలో రవికి తీవ్ర గాయాలు కాగా, పోలీసులు ఆయనను తాడేపల్లిగూడెం ఆసుపత్రికి తరలించారు. కానిస్టేబుల్ను ఢీకొట్టిన బస్సు ఆపకుండా వెళ్లిపోయిందని స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
News February 21, 2026
అల్లు అర్జున్ ప్రైవేట్ పార్టీలో రామ్చరణ్, ఉపాసన

తన తమ్ముడు శిరీష్-నయనిక పెళ్లి నేపథ్యంలో అల్లు అర్జున్ ప్రీవెడ్డింగ్ పార్టీ ఇచ్చారు. అత్యంత సన్నిహితులని మాత్రమే ఇన్వైట్ చేసిన ఈ పార్టీకి రామ్చరణ్-ఉపాసన దంపతులు హాజరయ్యారు. కాబోయే జంటతో పాటు అల్లు అర్జున్-స్నేహారెడ్డి, చెర్రీ-ఉపాసన దిగిన ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. పార్టీకి మెగాస్టార్ కూతురు సుస్మిత, నిహారిక, వైష్ణవ్ తేజ్, సుశాంత్, తదితరులు హాజరయ్యారు. మార్చి 6న శిరీష్-నయనిక వివాహం జరగనుంది.
News February 21, 2026
శ్రీకాకుళం: మృతి చెందిన మత్స్యకారుల కుటుంబాలకు నష్టపరిహారం విడుదల

మత్స్యకారులకు గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీం ద్వారా ఎక్స్ గ్రేషియా విడుదల చేయడం జరిగిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. శనివారం ఉదయం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. 2018 నుంచి ఇప్పటి వరకు 95 మంది మత్స్యకారులు మృతిచెందగా వారిలో 90 మందికి రూ.4 కోట్ల 75 లక్షలు నిధులు విడుదల చేసి వారి కుటుంబ సభ్యుల ఖాతాలకు జమ చేశామన్నారు. మిగిలిన ఐదుగురుకు సాంకేతిక కారణాల ద్వారా ఆగిందన్నారు.


