News March 19, 2025
పెద్దపల్లి: నేడు 186 మంది గైర్హాజరు

పెద్దపల్లి జిల్లాలో బుధవారం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా కొనసాగాయని జిల్లా నోడల్ అధికారి కల్పన పేర్కొన్నారు. రసాయనశాస్త్రం, కామర్స్ పేపర్లకు పరీక్షలు జరిగాయన్నారు. 4984 విద్యార్థులకు గాను 4798 హాజరయ్యారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 186 మంది విద్యార్థులు గైర్హాజరు అయ్యారని తెలిపారు. ఈ పరీక్షల్లో జనరల్ 106 మంది, వొకేషనల్ 80మంది విద్యార్థులు హాజరు కాలేదన్నారు.
Similar News
News December 20, 2025
అలాంటి చోట వాస్తు ప్రభావం ఉండదా ?

వేయి గడపలున్న చోట వాస్తు ప్రభావం ఉండదనుకోవడం భ్రమేనని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు చెబుతున్నారు. ‘తుపానులు, వరదలు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాలన్నీ సాంకేతిక, భౌగోళిక అంశాలు. వాటి వల్ల జరిగే నష్టాలను వాస్తుతో ముడిపెట్టకూడదు. చుట్టూ ఎన్ని ఇళ్లు ఉన్నా మన ఇంటి వాస్తు మనకు ముఖ్యం. వాస్తు అనుసరిస్తూనే, ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేలా ఇంటి నిర్మాణం ఉండాలి’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>
News December 20, 2025
సిరిసిల్ల: ‘మీ డబ్బు.. మీ హక్కు కార్యక్రమం సద్వినియోగం చేసుకోవాలి’

క్లెయిమ్ చేసుకోని ఆర్థికపరమైన ఆస్తుల కోసం ఈ నెల 22 వ తేదీన ‘మీ డబ్బు.. మీ హక్కు’ పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రోగ్రామ్ కన్వీనర్, లీడ్ బ్యాంక్ మేనేజర్ మల్లికార్జున రావు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో మధ్యాహ్నం ఒంటిగంటకు ఈ కార్యక్రమం నిర్వహిస్తామని, క్లెయిమ్ చేసుకోని ఆర్థికపరమైన ఆస్తుల వాస్తవ యజమానులు వాటిని పొందేందుకు దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News December 20, 2025
ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

TG: రాష్ట్రంలో ఈ నెల 23 వరకు పలుజిల్లాల్లో శీతల గాలులు వీస్తాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు ఉదయం 8.30 గంటల వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో చలిగాలులు వీస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పలు చోట్ల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4-5 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.


