News November 13, 2024
పెద్దపల్లి: పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. రాకపోకలకు అంతరాయం

పెద్దపల్లి జిల్లా రాఘవపూర్- కన్నాల మధ్యలో గూడ్స్ రైలు పట్టాలు తప్పి ఆరు బోగీలు పడిపోయాయి. దీంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మంగళవారం రాత్రి గజియాబాద్ నుంచి కాజీపేట వైపు వెళుతుండగా ప్రమాదం జరిగింది. సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లతో పాటు ఎక్స్ప్రెస్, ప్యాసింజర్ రైళ్లు ఎక్కడికక్కడ పట్టాలపై నిలిచిపోయాయి. రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పునరుద్ధరణ చర్యలు చేపడుతున్నారు.
Similar News
News November 10, 2025
కరీంనగర్: సీఐటీయూ నూతన కార్యవర్గం ఎన్నిక

కరీంనగర్ జిల్లా కేంద్రంలో సోమవారం జరిగిన సీఐటీయూ జిల్లా 11వ మహాసభలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులుగా ఉప్పునీటి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా గిట్ల ముకుంద రెడ్డి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. సీఐటీయూ బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
News November 9, 2025
KNR: ట్రాఫిక్ చలాన్ పేరుతో సైబర్ మోసం

KNR జిల్లాలో సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతుల్లో ప్రజలను మోసం చేస్తున్నారు. ట్రాఫిక్ చలాన్ పేరుతో ఫేక్ వాట్సాప్ మెసేజ్ పంపి, APK యాప్ డౌన్లోడ్ చేయించడంతో చెర్లబుత్కూర్ గ్రామానికి చెందిన మధుకర్ ఖాతా నుంచి రూ.70,000లు, ఇతర బాధితుల నుంచి మరో రూ.1.20 లక్షల వరకు సొమ్ము మాయమైంది. బాధితుల ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనుమానాస్పద లింకులు, యాప్లను క్లిక్ చేయవద్దని పోలీసులు సూచించారు.
News November 8, 2025
కరీంనగర్ జిల్లా ప్రగతిపై గవర్నర్ సమీక్ష

కరీంనగర్ జిల్లా పర్యటనలో భాగంగా గవర్నర్ శుక్రవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా అధికారులు, ప్రముఖులతో ముఖాముఖి నిర్వహించారు. అంతకుముందు శాతవాహన యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. కలెక్టర్ పమేలా సత్పతి పవర్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా సమగ్ర స్వరూపాన్ని, కేంద్ర, రాష్ట్ర పథకాల అమలు తీరును గవర్నర్కు వివరించారు. పథకాలు సమర్థవంతంగా అమలు అవుతున్నాయని కలెక్టర్ పేర్కొన్నారు.


