News December 14, 2025

పెద్దపల్లి: పల్లెపోరులో గెలిచి నిలిచేదెవరో..?

image

పెద్దపల్లి జిల్లాలోని రెండో దశ పోలింగ్‌లో 4 మండలాల్లో జరిగిన పోలింగ్ ముగిసింది. మొత్తం 70 గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాలకు, 504 వార్డు స్థానాలకు జరిగిన ఈ పల్లెపోరులో ఎవరు గెలుస్తారో అనేది ఉత్కంఠంగా మారింది‌. కౌంటింగ్ ప్రక్రియ మొదలవడంతో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. మరి ఈ పల్లె పోరులో ఎవరు గెలుస్తారో కాసేపట్లో తెలుస్తుంది. మరింత సమాచారం కోసం Way2Newsను ఫాలో అవ్వండి.

Similar News

News December 15, 2025

ఒంటిమిట్ట వద్ద ఘోర ప్రమాదం.. యువకుడి దుర్మరణం

image

మండలంలోని ఒంటిమిట్ట చెరువు కట్టపై ఆదివారం రాత్రి బైకు ఢీకొని యువకుడు మృతి చెందాడు. పోలీసుల వివరాలు మేరకు.. గోవిందమాల వేసుకొని తిరుమల పాత్ర వెళుతున్న ఎర్రగుంట్లకు చెందిన జగదీశ్(20)ని ఒంటిమిట్ట చెరువు కట్ట పైకి రాగానే రాజంపేట, బాసింగరిపల్లికి చెందిన కత్తి వెంకటేశ్(27) బైకుపై వేగంగా వచ్చి వెనుక వైపు నుంచి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో గాయపడిన ఇద్దరిలో జగదీశ్ చికిత్స పొందుతూ కడప రిమ్స్‌లో మృతిచెందాడు.

News December 15, 2025

HYD: న్యూ ఇయర్ కోసం వెయిటింగా? మీకోసమే

image

HYD న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు. DEC 31 అర్ధరాత్రి నుంచి జనవరి 1 వరకు పబ్‌లు, బార్‌లు, హోటళ్లలో CCకెమెరాలు, సెక్యూరిటీ తప్పనిసరి. మైనర్లకు ఎంట్రీ, మద్యం నిషేధం, డీజేలు, అశ్లీల నృత్యాలు, రాత్రి 10 తర్వాత లౌడ్ స్పీకర్లు బ్యాన్. మద్యం తాగి వాహనం నడిపితే కేసులు, జరిమానా, జైలు శిక్ష విధిస్తామని CP సజ్జనార్ హెచ్చరించారు. న్యూ ఇయర్ ఈవెంట్లు రాత్రి 12:30లోపు ముగించాలన్నారు.

News December 15, 2025

శ్రీకాకుళం జిల్లా మార్పుపై డిమాండ్

image

పలాసను కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌పై అన్ని పార్టీ నాయకులు కలిసికట్టుగా సహకరించాలని మాజీ కేంద్రమంత్రి కిల్లి.కృపారాణి పేర్కొన్నారు. ఆదివారం టెక్కలిలోని ఆమె కార్యాలయంలో పలాస జిల్లా సాధన కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. కొత్తగా పలాస జిల్లా ఏర్పడితే మొట్టమొదటిగా లాభపడేది ఇచ్ఛాపురం నియోజకవర్గమేనని, వారి సహకారం అవసరమన్నారు. పలాసను జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.