News March 3, 2025
పెద్దపల్లి: పోలీస్ స్టేషన్ను పేల్చి 29 ఏళ్లు

PDPL జిల్లా ఓదెల(M) పొత్కపల్లి పోలీస్ స్టేషన్ను మావోయిస్టులు పేల్చిన ఘటనకు నేటితో 29ఏళ్లు. 1996 మార్చి 3న జరిగిన ఈ ఘటనతో దేశమే ఉలిక్కిపడింది. దాడిలో కానిస్టేబుల్ షేక్ దాదా మరణించగా.. అప్పటి SI శ్రీధర్ రావుతో పాటు పోలీస్ సిబ్బందిని నక్సల్స్ అధీనంలోకి తీసుకున్నారు. ఎట్టకేలకు 2003లో అప్పటి SP RS ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో కొత్త స్టేషన్ను నిర్మించి హోంమంత్రి దేవేందర్ గౌడ్ చేతుల మీదుగా ప్రారంభించారు.
Similar News
News February 28, 2026
మెదక్: ఉమ్మడి జిల్లాలో ముగ్గురు కలెక్టర్లు మహిళలే!

ఉమ్మడి మెదక్ జిల్లాలో పాలనాధికారులు (కలెక్టర్లు) ముగ్గురూ మహిళలే కావడం విశేషం. ఉమ్మడి జిల్లాలో సంగారెడ్డి కలెక్టర్గా ప్రావీణ్య, సిద్దిపేట కలెక్టర్గా హైమావతి ఉండగా తాజాగా జరిగిన కలెక్టర్ల బదిలీలో మెదక్ కలెక్టర్ గా ప్రతిమా సింగ్ నియమితులయ్యారు. దీంతో ఉమ్మడి జిల్లా పరిపాలనలో మహిళల చేతిలో ఉంది. 2016లో ఉమ్మడి జిల్లాను మూడు జిల్లాలు (మెదక్, సంగారెడ్డి, సిద్ధిపేట)గా విభజించిన విషయం తెలిసిందే.
News February 28, 2026
అడ్డతీగల: సీపీఆర్ చేసి ప్రాణాలు నిలిపిన డాక్టర్

అడ్డతీగల మండలంలో జరిగిన కారు ప్రమాదంలో క్షతగాత్రులకు సీపీఆర్ చేసి ఆ డాక్టర్ ప్రాణదాతగా నిలిచారు. మిట్లపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు యువకులకు తీవ్రగాయాలు అవ్వగా, ఆ సమయంలో అటుగా వెళ్తున్న జడ్డంగి వైద్యాధికారిని పావని వారికి సీపీఆర్ చేసి అడ్డతీగల ఆసుపత్రికి పంపించారు. కాగా ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. డాక్టర్ పావని సీపీఆర్ చేసి ఉండకపోతే మరణాలు సంఖ్య పెరిగేదని స్థానికులు తెలిపారు.
News February 28, 2026
నల్గొండ: పన్ను వసూళ్ల ‘డెడ్ లైన్’.. 32 రోజులే గడువు

మున్సిపాలిటీల్లో పన్ను వసూలుకు గడువు ముంచుకొస్తోంది. ఫిబ్రవరి ముగుస్తుండగా.. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 32 రోజుల గడువు మాత్రమే మిగిలిఉంది. అయినా జిల్లాలోని NLG, MLG, DVK, HLY, CTL CDR, NKL, నందికొండ మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను వసూళ్లు అంతంత మాత్రంగానే ఉన్నాయి. JAN, FEBలో మున్సిపల్ ఎన్నికల హడావిడితో అధికారులు, సిబ్బంది పన్నుల వసూళ్లపై దృష్టి సారించలేకపోయారు. దీంతో బల్దియాల్లో బకాయిలు పేరుకుపోయాయి.


